Thursday, 31 October 2013

ఫెంగ్ షూ : బెడ్‌రూం సూత్రాలు

- శ్రీభావ

ఫెంగ్‌షూ సిద్ధాంతాల ప్రకారం ఇంటిలో ఎలాంటి రంగులు వాడాలో గత వారం తెలుసుకున్నాం. ఈ వారం బెడ్‌రూమ్‌ను ఫెంగ్‌షూ సిద్ధాంతాల ప్రకారం ఎలా సర్దుకోవాలో తెలుసుకుందాం..

ఇంటికి దీపం ఇల్లాలు అనేది మన నానుడి. ఇదే విధంగా ప్రతి ఇంట్లో బెడ్‌రూం చాలా కీలకం. ఇంట్లో నివసించే వ్యక్తులు శారీరకంగా, మానసికంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే బెడ్‌రూమ్‌ను ఫెంగ్‌షూ సూత్రాల ప్రకారం సర్దుకోవాలి. అలాంటి ఏడు సూత్రాలను చూద్దాం..

1. బెడ్‌రూమ్‌లో టీవీ, కంప్యూటర్, వ్యాయామం చేయటానికి ఉపయోగించే పరికరాలు ఉండకూడదు. వీటి వల్ల బెడ్‌రూమ్‌లో సహజసిద్ధంగా ఉండే ఫెంగ్‌షూ శక్తి కలుషితమయిపోతుంది. ప్రతికూల శక్తి ప్రవేశిస్తుంది. దీనితో మానసిక ఆందోళన కలుగుతుంది. ఈ మధ్యకాలంలో చాలా మంది బెడ్‌రూంలలో టీవీలను పెట్టుకుంటున్నారు. ఇది మంచిది కాదు.
2. వీలైనంత ఎక్కువ సేపు బెడ్‌రూం తలుపులు, కిటికీలు తీసి ఉంచాలి. దీనివల్ల గాలి ధారాళంగా లోపలికి రాగలుగు తుంది. ఉదయం పూట సూర్యకిరణాలు బెడ్‌రూంలోని ఫర్నిచర్‌ను తాకితే మంచిది. చిన్న చిన్న సూక్ష్మక్రిములు ఈ కిరణాల తాకిడికి నాశనమయిపోతాయి. బెడ్‌రూమ్‌లో మొక్కలు పెట్టుకోకూడదు. ఒక వేళ బెడ్‌రూమ్ చాలా పెద్దగా, రెండు భాగాలుగా ఉంటే మంచానికి దూరంగా మొక్కలను పెట్టుకోవచ్చు. ఎటువంటి పరిస్థితుల్లోను మంచంపై తలపెట్టుకొనే వైపు మొక్కలను ఉంచకూడదు.
3. బెడ్‌రూంలో మంచం మీద పడుకున్నప్పుడు నేరుగా కాంతి మొహం మీద పడేలా ఉండకూడదు. ఫెంగ్‌షూ సూత్రాల ప్రకారం రాత్రిళ్లు బెడ్‌లైట్ పెట్టుకోవటం కన్నా క్యాండిల్ వెలిగించి దాని నుంచి వచ్చే కాంతిలో నిద్రించటం మంచిది.
4. బెడ్‌రూం కేవలం నిద్రించటానికి మాత్రమే కాదు. భాగస్వాముల మధ్య లైంగిక శక్తి స్వేచ్ఛగా ప్రసరించటానికి కూడా బెడ్‌రూం ఉపయోగపడుతుంది. అందువల్ల బెడ్‌రూంలో 'చర్మపు రంగులు' ఉపయోగించాలి. (కొందరు చాలా తెల్లగా ఉంటారు. మరి కొందరు చామనఛాయలో ఉంటారు. ఇంకొందరు మట్టి రంగులో ఉంటారు. మానవుల చర్మం ఛాయలను చర్మపురంగులుగా పిలుస్తారు).
5. బెడ్‌రూంలో ఆనందాన్ని, సంతోషాన్ని ప్రతిబింబించే చిత్రాలను ఉంచుకోవాలి. క్రూరజంతువుల బొమ్మలను, విషాదాన్ని పెంచే బొమ్మలను ఉంచకూడదు. నల్లటి ఫ్రేములను ఉపయోగించకపోవటం మంచిది.
6. బెడ్‌రూంలో మంచాన్ని అటూ ఇటూ మారుస్తూ ఉండకూడదు. ఎంపిక చేసిన ఒక ప్రాంతంలోనే ఉంచాలి. మంచానికి రెండు వైపులా దిగే విధంగా కొంత ఖాళీ ఉంచాలి. మంచానికి అటూ ఇటూ రెండు బెడ్‌సైడ్ టేబుల్స్ ఉంటే మంచిది. మంచం గుమ్మానికి ఎదురుగా ఉండకూడదు. మంచం చాలా ఎత్తులో ఉండకూడదు. మరీ తక్కువ ఎత్తులో కూడా ఉండకూడదు.
7. రాత్రి నిద్రపోయే సమయంలో బెడ్‌రూంకి ఉన్న తలుపులన్నీ వేయాలి. దీని వల్ల ఫెంగ్‌షూ శక్తి బయటకు పోదు.
Courtesy-Andhrajyothy

వికాసం: అందంగా మాట్లాడటం ఒక కళ!

Sakshi | Updated: September 29, 2013 02:34 (IST)
వికాసం: అందంగా మాట్లాడటం ఒక కళ!
 ‘మాట్లాడటం సిల్వర్; మౌనం బంగారం’ అన్న ఇంగ్లిష్ సామెత కరెక్టయితే అయ్యుండచ్చు గాక. దీని కన్నా మించిన సూక్తి ‘సరైన సందర్భంలో సరిగ్గా మాట్లాడటం ప్లాటినం!’

 ‘నీ భార్య చనిపోయిందని తెలిసి చాలా సంతోషంగా ఉంది’ అన్నాడు ఓ స్నేహితుడు. అసలే భార్య మరణించి రోదిస్తూన్న వ్యక్తి ఈ మాటలకి నిర్ఘాంతపోయాడు. ‘నీకు క్యాన్సర్ అని డాక్టర్లు నిర్ధారించారట’ స్నేహితుడు కొనసాగించాడు. ‘ఇంకో నాలుగైదు నెలల కన్నా బతకవని చెప్పారట. నిజమేనా? పిల్లలు కూడా లేరు కదా! ఎంతో సంతోషంగా ఉంది’. వింటున్న వ్యక్తి సాచి పెట్టి కొట్టాడు.

 ‘మాట్లాడటం సిల్వర్; మౌనం బంగారం’ అన్న ఇంగ్లిష్ సామెత కరెక్టయితే అయ్యుండచ్చు గాక. దీని కన్నా మించిన సూక్తి ‘సరైన సందర్భంలో సరిగ్గా మాట్లాడటం ప్లాటినం!’.
 మన ఫీలింగ్‌ని అవతలివారికి కరెక్ట్‌గా అర్థమయ్యేలా చెప్పగలగటం ఒక కళ. దీన్నే ‘కమ్యూనికేషన్’ అంటారు. పై సంఘటనలో స్నేహితుని ఉద్దేశం ఏమిటంటే, ‘నీవొక ఆరు నెలల్లో మరణించబోతున్నావు, నీకెలాగో పిల్లల్లేరు. ఇప్పుడు నీ భార్య కూడా మరణించింది. ఆ విధంగా నీకు అన్ని భవబంధాలు నశించాయి. ఎంతో అదృష్టం చేసుకుంది కాబట్టే నీ అంతిమ దినాల్లో కష్టాలు చూడకుండా, నీ మరణం తరువాత కష్టాల్ని భరించకుండా నీ భార్య ఈ లోకం నుండి వెళ్లిపోయింది.’

 ఇది సరిగ్గా చెప్పలేకే అతడు ఒక స్నేహాన్ని పోగొట్టుకున్నాడు. సాంఘిక సేవలో నిమగ్నమైన ఒక నిశ్శబ్ద సోషల్ వర్కర్‌కి భారతరత్న రావొచ్చు. మౌనంగా తన పని తాను చేసుకుపోయే ఒక సైంటిస్ట్‌కి నోబుల్ ప్రైజ్ రావొచ్చు. కానీ సమాజంలో పేరు, ప్రతిష్ట పెరగాలంటే మనిషికి ఈ ఏడు రకాల అంశాల్లో ‘కనీసం కొన్నయినా’ ఉండాలి. తెలివి, విషయ పరిజ్ఞానం, లౌక్యం, ఇతరులతో సంబంధాలు, డబ్బు, దాతృత్వం, కమ్యూనికేషన్. చివరిది అన్నిటికన్నా ముఖ్యం.

 అవసరం లేని విషయాన్ని మాట్లాడటం, అసందర్భమైన సమయంలో మాట్లాడకుండా ఉండటం కళ. తప్పు సంకేతం వచ్చేలా మాట్లాడటం మరీ దారుణం. ఆ విషయాన్ని పై స్నేహితుడి ఉదాహరణ నిరూపిస్తుంది. ఒక విషయాన్ని అవతలివారికి చెప్పేటప్పుడు, అది వారికి సరిగ్గా అర్థం అయిందా లేదా అని చూడాలి. ఒక దినపత్రికలో ‘నక్సలైట్లు పోలీస్‌స్టేషన్‌ను చుట్టు ముట్టి, కాల్పులు జరిపినప్పుడు పోలీసులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఇందులో ఆరుగురు గాయపడ్డారు’ అని వార్త వచ్చింది. గాయపడింది పోలీసులో, నక్సలైట్లో చదివేవారికి అర్థం కాలేదు.


 చదవటం, రాయటం, మాట్లాడటం, వినటం, హావభావాలు, సంజ్ఞల మీద కమ్యూనికేషన్ అనేది ఆధారపడి ఉంటుంది. సంభాషణాన్ని రెండు రకాలుగా విడగొట్టవచ్చు. ప్రైవేట్ స్పీకింగ్, పబ్లిక్ స్పీకింగ్. ప్రైవేట్ కమ్యూనికేషన్‌లో నాలుగు అంశాలు దృష్టిలో పెట్టుకోవాలి.
 1. మన మూడ్, మాట్లాడటానికి తగిన విధంగా ఉందా? 2. అవతలివారి మూడ్, వినటానికి సరైన స్థితిలో ఉందా? 3. అవతలివారి మూడ్‌ని, మన మాటల్తో మార్చగలిగే పరిస్థితి ఉందా? 4. అవతలివారి పరిస్థితిని బట్టి మన మూడ్ మార్చుకొనే అవసరం ఉందా?

 ఈ చివరి దాన్ని భావోద్వేగ నియంత్రణ (ఎమోషనల్ కంట్రోల్) అంటారు.
 ఐదు జ్ఞానేంద్రియాలతో మనం గ్రహించేది ‘వాస్తవం’. అది దృశ్యం కావొచ్చు. పరిమళం కావొచ్చు. శబ్దం కావొచ్చు. అలా గ్రహించిన దాన్ని మనం ఏ విధంగా అన్వయించుకుంటామనేది మన ‘ఫీలింగ్’.
 - యండమూరి వీరేంద్రనాథ్
Courtesy-Sakshi

విజయం: గెలవడమూ, గెలిపించడమూ తెలుసు!


Sakshi | Updated: September 29, 2013 02:48 (IST)
విజయం: గెలవడమూ, గెలిపించడమూ తెలుసు!
ప్రకాష్ చంద్ర ముర్ము.. ఈ కుర్రాడికి స్కూలుకెళ్లి చదువుకోవడమే ఓ కల. అలాంటిది అతనికి చదువుతో పాటు.. లండన్‌కు వెళ్లి రగ్బీ ఆడే అవకాశం కూడా దక్కింది. స్కూలు చదువైనా పూర్తి చేస్తానా అని అనుమానమున్న సీమా హన్స్‌డా ఎంబీబీఎస్ చదువుతోంది. సౌదాగర్ హన్స్‌డా లా చేస్తున్నాడు. సంజుక్త రాణి హెంబ్రమ్ ఎంఏ ఎకనామిక్స్ పూర్తి చేయబోతోంది. వీళ్ల పేర్లు గమనిస్తే.. అందరూ గిరిజనులే అని అర్థమైపోతోంది. వీళ్లందరికీ సుదూర స్వప్నంలా కనిపించిన ‘ఉన్నత చదువు’ను చేరువ చేసిన ఉన్నతుడు డాక్టర్ అచ్యుత సమంత. పేద కుటుంబంలో పుట్టి, చదువుకోవడానికి అష్టకష్టాలు పడిన ఈ సామాన్యుడు.. దేశంలోనే ఒకానొక డీమ్డ్ యూనివర్శిటీకి అధిపతి అయ్యే స్థితికి చేరిన వైనం స్ఫూర్తిదాయకం!

 ఒడిషాలో ‘కిస్’ అంటే తెలియని వారుండరు. ఇందులో దురర్థమేమీ లేదు. కిస్ అనేది గిరిజనుల కోసం వెలసిన యూనివర్శిటీ. కళింగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్‌కు సంక్షిప్త రూపమే కిస్. ఒక సక్సెస్ నుంచి మరెన్నో సక్సెస్‌లకు వేదికైన గొప్ప విద్యాలయం ఇది. దేశంలో అతి పెద్ద డీమ్డ్ యూనివర్శిటీల్లో ఇదొకటి. 25 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించిన ఈ యూనివర్శిటీ ఇప్పటిదాకా 20 వేల మందికి పైగా గిరిజన విద్యార్థులకు గూడునిచ్చి, కడుపు నింపి, విద్యాబుద్ధులు చెప్పి వారికి జీవితాన్నిచ్చింది. దీని వ్యవస్థాపకుడు అచ్యుత సమంత.  గిరిజనుల కోసం ఇంత చేస్తున్నాడు కాబట్టి.. సమంత కూడా గిరిజనుడే అనుకుంటే పొరబాటే. ఆయన కులం, మతం గురించి ప్రస్తావన అనవసరం. కానీ ఆయన గిరిజనుడు మాత్రం కాదు. కానీ పేదరికం గురించి మాత్రం బాగా తెలిసిన, అనుభవించిన వ్యక్తి. చిన్నప్పుడే తండ్రి చనిపోతే.. తల్లి చిన్నచిన్న పనులు చేసి అచ్యుతను చదివించింది. అతను కూడా చదువుకుంటూనే రకరకాల పనులు చేశాడు. కానీ ఏనాడూ చదువును నిర్లక్ష్యం చేయలేదు. పట్టుదలతో చదివి రసాయన శాస్త్రంలో పీజీ చేశాడు.

 అనంతరం పదేళ్ల పాటు వివిధ కళాశాలల్లో అధ్యాపకుడిగా పనిచేశాడు. ఐతే జీవితంలో స్థిరపడినా సమంత మనసు మాత్రం స్థిమితంగా లేదు. ఇంకా ఏదో సాధించాలని 1992లో తన దగ్గరున్న రూ.5 వేల పెట్టుబడితో రెండు గదులు అద్దెకు తీసుకుని ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సెంటర్ మొదలు పెట్టాడు. గిరిజన పిల్లల్ని అందులో చేర్చుకుని వారికి శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టాడు. అదే తర్వాత కళింగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ (కేఐఐటీ)గా మారింది. తర్వాత ‘కిస్’ కూడా శ్రీకారం చుట్టుకుంది. ఐతే ఈ క్రమంలో సమంత పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. తన విద్యా సంస్థల్ని తీర్చిదిద్దే క్రమంలో ఆయన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నారు. మొదట్లోనే ఆయన వడ్డీ వ్యాపారులకు రూ.15 లక్షలు బాకీ పడ్డారు. ఐతే ఓ జాతీయ బ్యాంకు ఆయనకు లోన్ ఇచ్చి ఆదుకుంది.

 ఈ డబ్బులతో తన విద్యా సంస్థను అభివృద్ధి చేసి తన కష్టాలన్నింటికీ చెక్ పెట్టేశారు సమంత. ప్రస్తుతం ‘కిస్’లో లేని కోర్సంటూ లేదు. కేజీ నుంచి పీజీ వరకు ఏ చదువైనా దొరుకుతుందిక్కడ. ఐతే ప్రవేశం గిరిజనులకు మాత్రమే. యూనివర్శిటీకి వెళ్లో.. లేక ఆన్‌లైన్లోనే అప్లికేషన్ సమర్పిస్తే చాలు.. వారి పరిస్థితిని బట్టి ఉచితంగా లేదా నామమాత్రపు ఫీజులతో భోజనం, వసతి కల్పించి చదువు చెప్పిస్తారు. గత పదేళ్లుగా ‘కిస్’లో డ్రాపౌట్ ఒక్కరూ లేరు. వంద శాతం ఫలితాలతో దూసుకెళ్తోంది కిస్. ఈ యూనివర్శిటీ కోసం సమంత చేసిన త్యాగాలు అసామాన్యమైనవి. ఆయన పెళ్లి కూడా చేసుకోలేదు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ ‘కిస్’కు స్వయంగా విచ్చేసి సమంతను అభినందించారు. కేంద్ర ప్రభుత్వం ఆయనకు జవహర్‌లాల్ నెహ్రూ పురస్కారాన్ని ప్రదానం చేసింది. ఆయన నిస్వార్థ కృషికి జాతీయంగా, అంతర్జాతీయంగా మరెన్నో అవార్డులు దక్కాయి.
 -  ప్రకాష్ చిమ్మల
Courtesy-Sakshi

మీ కంప్యూటరే షాపింగ్‌మాల్!

Sakshi | Updated: October 20, 2013 02:08 (IST)
మీ కంప్యూటరే షాపింగ్‌మాల్!
 వివరం
  రిటైల్ మార్కెట్ల హవా ఇదివరకటి మాట! ‘ఈ’టైల్ మార్కెట్ల హవా లేటెస్ట్ ట్రెండ్!! ఉప్పు నుంచి పప్పుదాకా...
 పెన్‌డ్రైవ్ నుంచి కెమెరాల దాకా..  గృహోపకరణాల దగ్గర్నుంచీ  వ్యాయామ పరికరాల దాకా.. బోలెడన్ని ఆప్షన్లు ఒక్క క్లిక్కు
 దూరంలో! బయటకు వెళ్లాల్సిన పని లేదు. షాపులన్నీ తిరిగి ఎక్కడ తక్కువకు ఇస్తున్నారోనని లెక్కలు తేల్చుకోవాల్సిన
 కష్టం లేదు. అన్నిటికీ ఆన్‌లైన్ మంత్రమే. ఆర్డరిస్తే చాలు.. ఇంటిముందుకు వస్తువు రెక్కలు కట్టుకు వచ్చి వాలుతుండటంతో
 దేశంలో ఆన్‌లైన్ ట్రేడింగ్ విలువ ఏటికేడాదీ పెరిగిపోతోంది. 2017 నాటికి భారత ఇ-కామర్స్ మార్కెట్ విలువ
 రూ.లక్ష కోట్ల మార్కు దాటుతుందని అంచనా. ఏ వస్తువునైనా కంటితో చూసి.. చేతితో తాకి తృప్తిచెందాకగానీ
 కొనని భారతీయుల మనస్తత్వాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇది చాలా ఎక్కువ కిందే లెక్క!

 ఇ-టెయిలింగ్ ఇండియా ఎక్స్‌పో.. అనే మాట ఎప్పుడైనా విన్నారా! ఈ ఏడాది మొదట్లో ఈ ఎక్స్‌పో (ప్రదర్శన) ముంబైలో జరిగింది. తర్వాత జైపూర్‌లో, బెంగళూరులలోనూ నిర్వహించారు. సెప్టెంబర్‌లో చెన్నైలో, నవంబర్‌లో ఢిల్లీలోనూ మరో రెండు కాన్ఫరెన్స్‌లు జరగనున్నాయి! ఇవే కాదు.. అంతా ఆన్‌లైన్‌మయం అయిన ఈ రోజుల్లో నెట్ ప్రపంచంలో మనకు తెలియకుండా చాలానే జరిగిపోతున్నాయి. గణాంకాలు కావాలా.. ముంబైలో జరిగిన ఎక్స్‌పో కాన్ఫరెన్స్ లెక్కల ప్రకారమైతే మనదేశంలో ఆన్‌లైన్ షాపర్ల సంఖ్య ప్రస్తుతానికి రెండు కోట్లు. కానీ.. మరో పదేళ్లలో ఈ సంఖ్య 30 కోట్లకు చేరుతుందని ఇ-కామర్స్ నిపుణుల అంచనా. 2000 సంవత్సరం నుంచే మనదేశంలో ఇ-కామర్స్ ఉనికి ఉన్నప్పటికీ ఇటీవలికాలంలో మాత్రమే అది ఊపందుకుంది. 2008-09 దాకా కూడా ‘ఈ’ట్రెండ్ అంతగా జోరందుకోలేదు. దీనికి కారణం భారతీయుల మనస్తత్వమే. సాధారణంగా మనం ఏదైనా వస్తువు కొనాలంటే నాలుగైదు షాపులు తిరుగుతాం. అదే వస్తువును వివిధ కంపెనీలు ఏ ధరకు ఇస్తున్నాయో లెక్కలు వేస్తాం. వాటిని కళ్లారా చూసి, తాకిన తర్వాతే డబ్బు కట్టి ఇంటికి తీసుకెళతాం. దీనికి భిన్నంగా ఆన్‌లైన్‌లో వస్తువులను కంప్యూటర్ తెరమీదే చూడాలి. ఆన్‌లైన్‌లో ఆర్డరివ్వాలి. డబ్బులు డెబిట్/క్రెడిట్ కార్డు ద్వారా కట్టాలి. క్యాష్ ఆన్ డెలివరీ సదుపాయం కూడా ఉన్నప్పటికీ.. ఇంటికి వచ్చిన వస్తువును విప్పి చూసుకోకముందే డబ్బులు కట్టాలి. మొత్తమ్మీద ఇదంతా రిస్కుతో కూడిన వ్యవహారంలా కనిపించడంతో చాలామంది ఆన్‌లైన్ షాపింగ్ వైపు మొగ్గు చూపేవారు కాదు. కానీ, 2010 తర్వాత పరిస్థితిలో క్రమంగా మార్పు వచ్చింది. ఆన్‌లైన్ షాపింగ్ మరీ అంత ప్రమాదకరమైనదేమీ కాదన్న నమ్మకం చాలామందిలో కుదిరింది. దీనికితోడు, ఉద్యోగ రీత్యా ప్రత్యేకంగా షాపింగ్ చేయలేనంత బిజీ జీవితం.. ఒకవేళ తీరిక కుదిరినా నానా ఇబ్బంది పెట్టే ట్రాఫిక్ కష్టాల నేపథ్యంలో ‘ఇ-ట్రేడింగ్ ’ ఊపందుకుంది. ఇంతకంటే ఓ బలమైన కారణం కూడా ఉంది. మన సహోద్యోగులో, పొరుగువాళ్లో ఆన్‌లైన్లో సక్సెస్‌ఫుల్‌గా షాపింగ్ చేశాక... పర్వాలేదు మనమూ చేయొచ్చు అని ఇన్‌స్పైర్ అయిన వారు కూడా ఉన్నారు. వీటన్నిటికీ మించి.. అంతకుముందు భారతీయ పట్టణ యువతకు మాత్రమే క్రెడిట్/డెబిట్ కార్డులు, కంప్యూటర్లు ఇంటర్‌నెట్ వంటివి అందుబాటులో ఉండేవి. ఇటీవలికాలంలో స్మార్ట్‌ఫోన్ల విప్లవం పుణ్యమా అని పల్లెప్రాంతాలకు సైతం ఇంటర్‌నెట్ అందుబాటులోకి వస్తోంది. ఇది కూడా ఆన్‌లైన్ ట్రేడింగ్ పెరగడానికి దోహదం చేసింది. అదీకాక.. ఈ స్మార్ట్‌ఫోన్లను వాడే వారంతా యువత కావడం ఆన్‌లైన్ ట్రేడింగ్ ట్రెండ్‌కు మరింత ఊతమిస్తోంది. ప్రస్తుతం మన దేశంలో వందలకొద్దీ ఆన్‌లైన్ షాపింగ్ సైట్లున్నాయి. కానీ, వాటిలో.. ఏటా 100 మిలియన్ డాలర్లకు పైగా విక్రయాలు జరిపే ఫ్లిప్‌కార్ట్ లాంటి నమ్మకమైన సైట్లు దాదాపు 80 మాత్రమే. ప్రస్తుతం ఆన్‌లైన్ షాపింగ్‌కు అలవాటు పడ్డవారు సగటున నెలకు రెండు నుంచి మూడుసార్లు కొనుగోళ్లు జరుపుతున్నట్టు ఒక అధ్యయనం. వచ్చే రెండేళ్లలో ఈ సంఖ్య నాలుగు నుంచి ఐదుకు పెరుగుతుందని అంచనా. ప్రస్తుత ఆన్‌లైన్ షాపర్ల సంఖ్య రెండుకోట్లు అనుకున్నా.. ఆరు కోట్ల కొనుగోళ్లు అధికంగా నమోదవుతాయన్నమాటే.
 టిక్కెట్లూ...
 వస్తువులే కాదు.. టిక్కెట్లు కొనడమూ ఆన్‌లైన్ ట్రేడింగ్ కిందకే వస్తుంది. ఆన్‌లైన్‌లో వస్తువులు కొనడానికి సందేహించేవారు సైతం.. బస్సు, రైలు, సినిమా టిక్కెట్లను అలవోకగా ఆన్‌లైన్‌లో బుక్ చేసేస్తారు. మొబైల్ రీచార్జ్ కూడా ఆన్‌లైన్‌లోనే చేస్తున్నారు. ఇవన్నీ ఆన్‌లైన్ ట్రేడింగ్ కిందికే వస్తాయి. వీటిలో ఏమైనా మోసం జరుగుతుందేమోనన్న భయం వారికి అస్సలు ఉండదు. కారణం.. ఐఆర్‌సీటీసీ, ఆర్టీసీ వంటి నమ్మకమైన వెబ్‌సైట్ల ద్వారా టిక్కెట్లు కొనుగోలు చేస్తారు కాబట్టి. అదే వస్తువుల విషయానికి వచ్చేసరికి ‘‘ఆన్‌లైన్‌లో కొంటే సెకండ్ హ్యాండ్‌వి, పాడైపోయినవి, పనికిరానివి అంటగడతారేమో’’ అనే ఆందోళన చాలా మందికి ఉంటుంది. అలాగే.. ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేసేటప్పుడు డెబిట్/క్రెడిట్ కార్డు నెంబర్ వంటివి ఎంటర్ చేయడానికి భయపడి కూడా కొందరు ‘ఇ-కొనుగోళ్ల’ పట్ల అంత ఆసక్తి చూపరు.

 కానీ, అలాంటి భయాలు అనవసరం. నమ్మకమైన సైట్లలో కొనుగోలు చేస్తే ఎలాంటి భయాలకూ తావుండదు. వారంటీతో సహా, చక్కటి ప్యాకింగ్‌లో తక్కువ సమయంలో మనం ఆర్డర్ చేసిన వస్తువులు చేతికందుతాయి. సైట్‌లో చూసినట్టుగా లేకపోయినా, పనితీరులో ఏవైనా లోపాలున్నా మామూలు దుకాణాల్లోలాగానే పదిహేను రోజుల్లోగా తిరిగిచ్చే (కొన్నిరకాల వస్తువులైతే వాడకుండా) సదుపాయం ఆన్‌లైన్‌లో కూడా ఉంది. అంతేకాదు.. చాలా ఇ-షాపింగ్ సైట్లలో క్యాష్ బ్యాక్ గ్యారంటీ లబ్ధి కూడా లభిస్తోంది. వినియోగదారులు ఆర్డర్ ఇచ్చిన వస్తువును వీలైనంత వేగంగా వారికి అందేలా చేయడం, దుకాణం-దుకాణ నిర్వహణ వంటి ఖర్చులు లేకపోవడం వల్ల షాపులతో పోలిస్తే భారీ డిస్కౌంట్లతో.. మరింత తక్కువ ధరలకే ఇవ్వడం వంటి పథకాలతో ఈ సైట్లు వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి.

 చూసేవి గాడ్జెట్స్.. కొనేవి దుస్తులు
 మన దేశంలో ఆన్‌లైన్ షాపర్లు ఎక్కువ ఆసక్తితో సెర్చ్ చేసే వస్తువులు.. ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు. కానీ ఎక్కువగా కొనేది మాత్రం దుస్తులు. 2012 నవంబర్‌లో టీఎన్‌ఎస్ ఆస్ట్రేలియా గూగుల్ ఇండియా తరఫున ఈ సర్వే నిర్వహించింది. ఢిల్లీ, ముంబై, పూణె, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్ తదితర నగరాల్లో నమూనాగా యువత ఆన్‌లైన్ లావాదేవీల తీరుతెన్నులను విశ్లేషించింది.
     ఆన్‌లైన్ షాపింగ్‌లో ఎక్కువగా కొనుగోలు చేసే వస్తువులు.. దుస్తులు (84%), ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు (71%), సౌందర్య సంరక్షణ ఉత్పత్తులు(64%), పుస్తకాలు(62%), గృహోపకరణాలు (61%). పిల్లల ఆటబొమ్మలు, అలంకరణ సామగ్రి, ఆరోగ్య ఉపకరణాలు.. ఇటీవల నెలవారీ సరుకులు కూడా ఆన్‌లైన్ ద్వారా ఆర్డరిచ్చి తెప్పించుకుంటున్నారు.

     ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నవారిలో 30% తమ స్మార్ట్‌ఫోన్ల ద్వారానే ఈ కొనుగోళ్లు చేస్తున్నారు. అరచేతిలో వైకుంఠం అంటే ఇదేనేమో!!

     ఆన్‌లైన్ ద్వారా వస్తువుల్ని కొనుగోలు చేసేవారిలో 74% క్యాష్ ఆన్ డెలివరీ పద్ధతికే మొగ్గు చూపుతుండగా.. 18% డెబిట్‌కార్డు, 5% క్రెడిట్‌కార్డు వాడుతున్నారు.

 ఇవీ లాభాలు...
 సంప్రదాయ షాపింగ్‌తో పోలిస్తే.. ఆన్‌లైన్ షాపింగ్‌కి బోలెడు సౌలభ్యాలున్నాయి. మచ్చుకి కొన్ని..

 సౌకర్యం: ఎండా, వానా, దుమ్ము, ధూళీ, ట్రాఫిక్.. ఈ గొడవలేవీ ఉండవు. హాయిగా ఇంట్లోనే కూర్చుని ఆర్డరిస్తే కోరిన వస్తువు గుమ్మం వద్దకే వస్తుంది.

 వెరైటీ: ఒకే ఉత్పత్తి ఎన్నిరకాల రంగుల్లో, సైజుల్లో లభ్యమవుతోందో వివరంగా చూడొచ్చు. షాపులో అయితే అన్నిరకాలు ఉండవు, ఉన్నా సేల్స్‌మెన్ అన్నీ మనకు చూపించొచ్చు. చూపించకపోనూ వచ్చు. అదే ఆన్‌లైన్‌లో అయితే.. కంప్యూటర్ మనది, మౌస్ మనది.

 ధర: ఒకే వస్తువు ధర వివిధ సైట్లలో ఎలా ఉందో పోల్చిచూసుకోవచ్చు. చాలావరకూ ఆన్‌లైన్ షాపింగ్ సైట్లలో నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉండే దృష్ట్యా చెప్పుకోదగిన తక్కువ రేట్లకే వస్తువులను విక్రయిస్తారు.

 రివ్యూ: ఇది అన్నిటి కన్నా ముఖ్యమైనది. ఏదైనా వస్తువు కొనడానికి ముందు చాలా మంది చేసేపని.. గతంలో అదే వస్తువును కొని, వాడినవారు ఎవరైనా ఉన్నారా అని. వారి అనుభవాల ఆధారంగా సదరు వస్తువుపై ఒక అభిప్రాయం ఏర్పరచుకుంటారు. అలా తెలుసుకోవడమే లక్ష్యమైతే.. అందుకు ఆన్‌లైన్‌ను మించిన సాధనం లేదు. నెట్లో రకరకాల వస్తువులపై నిత్యం వేలాదిగా రివ్యూలు వస్తూనే ఉంటాయి. వాటిని చదివి మనకు ఏది కావాలో నిర్ణయించుకోవడం తేలికవుతుంది. వస్తువు పనితీరుపైనే కాదు, మీరు షాపింగ్ చేస్తున్న వెబ్‌సైట్  క్రెడిబిలిటీ రివ్యూలు కూడా ఉంటాయి. దాన్నిబట్టి అందులో షాపింగ్ చేయాలా వద్దా కూడా తెలుసుకునే అవకాశం ఉంది. ఒక విలువైన మాట... ఆన్‌లైన్లో ఏమేం దొరుకుతాయో చెప్పడం ఈజీయే గానీ ఏం దొరకవో చెప్పడం కష్టం. ఎందుకంటే కూరగాయలతో సహా అన్నీ అమ్మేస్తున్నారు.

 స్పెషల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి...
 లను పెంచుకుంటున్నాయి. ఉదాహరణకు కండోమ్‌లు, లోదుస్తులు, కామసూత్ర వంటి పుస్తకాలు ఆన్‌లైన్లో బాగా కొంటున్నారు. ఈమధ్యనే ఇలాంటి వాటికోసమే షైకార్ట్.కామ్ పుట్టింది! కొన్ని వస్తువులు ఆఫ్‌లైన్లో కొనాలంటే ఇబ్బంది. అందుకే అవి ఆన్‌లైన్లో అమ్మకాచెప్పులు, కళ్ల జోళ్లు సైజు చెక్ చేసుకునేవి కదా అని కొందరికి అనుమానం. వాటికి తగిన ఏర్పాట్లు ఉన్నాయి. చెప్పులైతే పర్మనెంట్ సైజు కాబట్టి తేడారాదు. కళ్లజోళ్లకు మన ఆకారంలోని ముఖాలతో ఆన్‌లైన్లో చెక్ చేయొచ్చు.

     వస్తువులు చాలా జూమ్‌లో చూసే అవకాశం ఉండటం వల్ల షాపులో కంటే క్లియర్‌గా ఉంటుంది. దుస్తులు వంటివైతే మోడల్స్‌కి వేసి ఫొటోలు పెడతారు కాబట్టి అవి ధరిస్తే ఎలా ఉంటాయో కూడా తెలిసిపోతుంది.

     పిల్లల వస్తువులు, దుస్తుల కోసమే పెద్ద సైట్లున్నాయి.  బొమ్మలు వాటిలో కొనడమే కరెక్టు. అమ్మాయిలకు ఏం కొనాలి, అబ్బాయిలకు ఏం కొనాలి... ఏ వయసు వారికి ఏది కొనాలఉంటారు. న్నది శాస్త్రీయంగా నిర్ణయించి

 బెస్ట్ ఆన్‌లైన్ షాపింగ్ సైట్లు...
 ఇతర దేశాల వారితో పోలిస్తే భారతీయులు నెట్‌లో డెబిట్/క్రెడిట్ కార్డులు ఉపయోగించి వస్తువులు కొనే సంఖ్య తక్కువ. దానికి కారణం నమ్మకం లేకపోవడం. ఒకసారి ఆ నమ్మకం చిక్కాక మాత్రం మనవాళ్లు కూడా విదేశీయులకు ఏమాత్రం తీసిపోకుండా ఆన్‌లైన్ కొనుగోళ్లు జరుపుతారు. అలాంటి నమ్మకమైన టాప్-5 సైట్లు..

 ఫ్లిప్‌కార్ట్ (www.flipkart.com)
  ఈ-బే (www.ebay.in)
  హోమ్‌షాప్-18 (www.homeshop18.com)
  యెభి (www.yebhi.com)
 జబాంగ్ (www.jabong.com)

 తీసుకోవాల్సిన జాగ్రత్తలు...

 ప్రముఖ వెబ్‌సైట్లలో కొనేటప్పుడు పెద్దగా ఇబ్బందులు ఎదురవవుగానీ.. మనకు నచ్చిన వస్తువు, నచ్చిన ధరలో ఇతర వెబ్‌సైట్‌లో కనిపించినప్పుడు తొందరపడి కొనుగోలు చేయకూడదు. ఆ సైట్ వివరాలను  పరిశీలించాలి. ‘అబౌట్ అజ్’ విభాగంలో పూర్తి అడ్రస్, ఈమెయిల్, 1800తో మొదలయ్యే (లేదా) మరో స్పష్టమైన ఫోన్ నెంబర్ ఉంటేనే ఆసైట్ ద్వారా కొనుగోలు చేయండి. కొనే ముందు వారికి ఓ ఫోన్ కాల్ చేసి ఎన్ని రోజుల్లో ఇస్తారు, నచ్చకపోతే ఎలా తిరిగి పంపాలి వంటి వివరాలు తెలుసుకునే కొనాలి.

     ఒకే వస్తువు రేటు వివిధ సైట్లలో ఎలా ఉందో పరిశీలించాలి. వస్తువు సరఫరా ఏ సైట్‌వారు వేగంగా చేస్తారో నిర్ధారించుకోవాలి. ఆయా సైట్లలో ఉన్న యూజర్ రివ్యూల ద్వారా ఆ విషయం తెలుసుకోవచ్చు.

     కొనుగోలు చేసిన వస్తువు నచ్చకుంటే, వెనక్కి తిరిగిచ్చే వీలుందా? ఉంటే అందుకు ఏయే షరతులున్నాయో ‘రిటర్న్ పాలసీ’ ద్వారా తెలుసుకోవాలి.

     కొన్ని రకాల ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఆన్‌లైన్‌లో కంటే బయటి మార్కెట్లోనే తక్కువకు దొరుకుతాయి. మార్కెట్లో అదే వస్తువు ఎంతకు దొరుకుతుందో వాకబు చేయాలి. ఒకవేళ తక్కువగా ఉందనిపిస్తే బయటే కొనుక్కోవడం మేలు.

     10 % డిస్కౌంటు.. 20% డిస్కౌంటు అని ఆయా సైట్లు చెప్పే కబుర్లను నమ్మక్కర్లేదు. ఎందుకంటే ఆ డిస్కౌంట్లన్నీ ఆయా వస్తువుల గరిష్ఠ చిల్లర ధర (ఎంఆర్‌పీ) మీద మాత్రమే ఇస్తారు. ఆమాత్రం తక్కువ ధరకు బయటకూడా దొరికితే బయటే కొనుక్కోవడం మంచిది.

     డెబిట్/క్రెడిట్ కార్డులపై ముందే చెల్లింపులు జరిపే కన్నా.. వీలైనంతవరకూ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఎంచుకోండి. కొన్ని సైట్లు ఈ విధానంలోనూ ఇంటి వద్ద డెబిట్/క్రెడిట్ కార్డులపై చెల్లించే అవకాశం కల్పిస్తున్నాయి.

 -పకాష్ చిమ్మల
Courtesy-Sakshi

గూగుల్ ప్లస్...Google plus (Telugu)

* సివిఎల్ఎన్ ప్రసాద్
సహారా ఎడారిలో జీవించే చిన్న సంచార సమూహానికి చెందిన చిత్రాల దగ్గర నుంచి.. అంతరిక్షంలోని అంతర్జాతీయ కేంద్రం తాజా కక్ష్య దాకా సకల సమాచారం గూగుల్‌లో దొరుకుతుందని కొత్తగా ఎవరికీ చెప్పక్కర్లేదు.. జీమెయిల్, గూగుల్ సెర్చ్, క్రోమ్ బ్రౌజర్- ఈ మూడిటితోనే ఆ కంపెనీ ఆగిపోయిందా? ప్రతి రోజు ఏదో ఒక విధంగా వార్తల్లో కనిపించే ఈ కంపెనీ ఇంకా ఏం చేస్తుంది? ఇలాంటి ప్రశ్నలు చాలామందికి తలెత్తుతూ ఉంటాయి. 'ఇంతింతై వటుడింతై..' అన్నట్లు మన కళ్ల ముందే అంచలంచెలుగా ఎదిగిన ఈ కంపెనీ అసలు కథేమిటి అని తరచి చూస్తే అనేక కొత్త విషయాలు తెలుస్తాయి. స్మార్ట్ ఫోన్లలో ఉపయోగించే ఆపరేటింగ్ సిస్టమ్‌లు, మానవ చోదకరహిత కార్లు, కళ్లజోళ్లలోనే ఇంటర్నెట్‌ను అందించే సదుపాయం, భూమికి 20 మైళ్ల ఎత్తులో టర్బైన్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసే బెలూన్లు, ప్రపంచంలోని అణువణువును అనుసంధానం చేసే సామర్థ్యమున్న బెలూర్లు- ఇలా ఒకటేమిటి- మన దైనందిన జీవితాన్ని ప్రభావితం చేసే పరిశోధనలు అనేకం బయట పడతాయి. తాజాగా క్యాన్సర్‌పై పరిశోధనలు చేయటానికి, వృద్ధాప్య సమస్యలను అడ్డుకోవటానికి కేలికో అనే కొత్త కంపెనీని కూడా గూగుల్ మొదలుపెట్టింది..

గూగుల్ వ్యవస్థాపకుడు లారీ పేజ్‌ను చూస్తే ఐటీ కంపెనీలలో కనిపించే సాధరణ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌లా ఉంటాడు. కానీ అతని ఆలోచనలన్నీ అసాధారణంగా ఉంటాయి. అత్యంత క్లిష్టమైన సమస్యలకు కూడా అతి సులువైన పరిష్కారాలుంటాయనేది అతని సిద్ధాంతం. 26 ఏళ్ల వయస్సులో అతని గొంతు నరాలకు పక్షవాతం రావడంతో అతను ఎక్కువగా మాట్లాడలేడు. కానీ ఈ వైకల్యం అతని ఆలోచనలకు ఏ మాత్రం అడ్డుకాదనే విషయం అతని వ్యూహాలను చూస్తే అర్థమవుతుంది. అలాంటి ఒక తాజా వ్యూహమే ' కేలికో'. క్యాన్సర్ పరిశోధనలపైనా, వృద్ధాప్యం రాకుండా చూడటానికి అవసరమైన మందులను అభివృద్ధి చేయటంపైనా పనిచేస్తుందిది. 'కేలికో'ను ప్రారంభిస్తున్నట్లు పేజ్ ప్రకటించిన వెంటనే ప్రపంచవ్యాప్తంగా సంచలనం చెలరేగింది. టెక్నాలజీ రంగంలో రారాజుగా వెలుగుతున్న గూగుల్- ఆరోగ్య రంగంలోకి ఎందుకు అడుగుపెట్టిందనే విషయంపై అనేక విశ్లేషణలు వెలువడ్డాయి.

క్యాన్సర్, వృద్ధాప్యం వంటి పరిష్కారం లేని సమస్యలపై పనిచేయడం మొదలుపెడితే మొదటికే మోసం వస్తుందని కొందరు నిపుణులు హెచ్చరించారు కూడా. కానీ పదేళ్ల క్రితం పేజ్- గూగుల్ మెయిల్‌ను ప్రారంభించినప్పుడు కూడా ఇలాంటి అనుమానాలే వెలువడ్డాయి. కొందరైతే గూగుల్ ప్రారంభించే కంపెనీలన్నింటికీ 'మూన్‌షాట్'లనే ముద్దుపేరు కూడా పెట్టారు. 'ఇలాంటి వాళ్లను ఎంతో మందిని చూశాం.. ఈ కంపెనీ కూడా బుడగలా పేలిపోతుంది' అని విమర్శకులు విశ్లేషణలు చేశారు. కానీ అవన్నీ తప్పని తేలాయి. నెమ్మదిగా పేజ్ ఆధ్వర్యంలో గూగుల్ మిగిలిన రంగాల్లోకి కూడా ప్రవేశించటం మొదలుపెట్టింది. "గూగుల్ సామర్థ్యమంతా సెర్చ్ బిజినెస్‌లో ఉంది. దానిని చెడగొట్టుకోకుండా- మిగిలిన రంగాలపై దృష్టి సారించాలనేది నా ఉద్దేశం. మిగిలిన కంపెనీల కన్నా ఒక్క అడుగైనా ముందుకు వేసి ఆలోచించకపోతే వెనకబడిపోతాం..'' అంటాడు పేజ్.

ఆలోచన వచ్చిందిలా...
అసలు గూగుల్ స్థాపనే చాలా చిత్రంగా జరిగింది. స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఉండగా పేజ్ కొన్ని పాఠ్యాంశాల కోసం యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో వెతకటం మొదలుపెట్టాడు. అవసరమైన వాటి కన్నా అనవసరమైనవి ఎక్కువ దొరికాయట ఆయనకు. దాంతో సెర్చ్ కొట్టిన వెంటనే వెబ్ పేజీలు అందించే సామర్థ్యం ఉన్న సెర్చ్ ఇంజన్ తయారుచేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. పేజ్‌కు సెర్గి బిన్ అనే స్నేహితుడు ఉండేవాడు. వీరిద్దరూ కలిసి సెర్చ్ ఇంజన్ తయారుచేశారు. మైక్రోసాఫ్ట్, యాహూ వంటి కంపెనీలు అప్పటికే టెక్నాలజీ రంగంలో ఉన్నా- అవి ఎప్పుడూ ఈ వైపు ఆలోచించలేదు. పేజ్ ఆలోచన క్లిక్ అయింది. 1998లో గూగుల్ ఒక కంపెనీగా అవతరించింది.

మొదట సెర్చ్ రంగంలోకి, ఆ తర్వాత ఈమెయిల్ రంగంలోకి ప్రవేశించింది. అప్పటికే మైక్రోసాఫ్ట్, ఎంఎస్ఎన్, ఏఓఎల్ వంటి కంపెనీలు ఉచిత ఈమెయిల్ సర్వీసును అందిస్తున్నాయి. అయినా గూగుల్ వీటన్నింటినీ అధిగమించగలిగింది. దీనికి కారణం అత్యంత క్లిష్టమైన సమస్యలకు కూడా సులభమైన పరిష్కారాలను కనిపెట్టడం, అందుబాటులో ఉన్న టెక్నాలజీలను సమర్థవంతంగా ఉపయోగించుకోవటం, అవసరమైనప్పుడు కొత్త టెక్నాలజీలను అభివృద్ధి చేయటం అనే త్రిసూత్రాల ఆధారంగా అది ముందుకెళ్ళడమే. 1998లో గూగుల్ ఒక కంపెనీగా ఏర్పడింది. ప్రస్తుతం ఈ కంపెనీ వద్ద 5400 కోట్ల డాలర్ల (32,000 కోట్ల రూపాయలు) నిల్వ లు ఉన్నాయి. ప్రతి ఏడాది గూగుల్‌కు 5000 కోట్ల డాలర్ల ఆదాయం వస్తుంది. దీనిలో 400 కోట్ల డాలర్లు యూట్యూబ్ నుంచి, 680 కోట్ల డాలర్లు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి, మిగిలిన సొమ్ము గూగుల్ సెర్చ్, మెయిల్‌లలో వచ్చే ప్రకటనల ద్వారా లభిస్తుంది.


చిత్రాతిచిత్రమైన ప్రాజెక్టులు
"ఒక సమస్యను పరిష్కరించాలంటే- మానవ వనరులు, ఆర్థిక వనరులు ఉంటే చాలనే అభిప్రాయం చాలా కంపెనీలలో ఉంది. ఇదే నిజమైతే ఈ పాటికి ప్రపంచంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కారమయిపోవాలి. అలా జరగటం లేదంటే కారణం వేరే ఉండి ఉండాలి. దానిని మనం అన్వేషించి పట్టుకోగలిగినప్పుడే సమస్యలు పరిష్కారమవుతాయి'' అనేది పేజ్ సిద్ధాంతం. దీని కోసం పేజ్ గూగుల్‌లో 'ఎక్స్' అనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశాడు. ఇది గూగుల్ ప్రధానకార్యాలయంలోనే ఉన్నా- దీనిలో జరిగే పరిశోధనల గురించి బయట ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువ.

'ఎక్స్'కు అధినేత సెర్గిబిన్. ఇప్పటి దాకా గూగుల్ ఎక్స్ చేస్తున్న పనులలో నాలుగు ప్రాజెక్టుల గురించే బయటకు తెలుసు. వీటిలో మొదటిది గూగుల్ గ్లాస్. ఇది బయటకు సాధారణమైన కళ్లజోడు మాదిరిగానే ఉంటుంది. కాని దీనికి వెబ్ అనుసంధానమై ఉంటుంది. ఒక ల్యాప్‌టాప్‌లో చేసే పనులన్నీ దీనిలో కూడా చేయవచ్చు. కంటి సంజ్ఞల ద్వారా, గొంతు ద్వారా నియంత్రించే సౌలభ్యం కూడా దీనిలో ఉంటుంది. ఇది ఇప్పటికే యూ రప్ మార్కెట్‌లోకి ప్రవేశించింది. 1500 డాలర్ల (రూ.90 వేలు)కు దొరికే ఈ కళ్లజోడు వల్ల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలుగుతుందనే విమర్శలు వెలువడటంతో- ఇంకా పూర్తి స్థాయిలో అన్ని మార్కెట్లలోను దీనిని ప్రవేశపెట్టలేదు.

ఇలాంటి మరొక చిత్రమైన ప్రాజెక్టే 'లూన్'. బెలూన్ల ద్వారా ప్రపంచంలోని అన్ని మూలలకు నెట్‌ను అందించటానికి ఉద్దేశించిన ఈ ప్రాజెక్టు ప్రయోగాత్మకంగా ఇప్పటికే విజయవంతమయింది. ఇది కార్యరూపం దాలిస్తే- భూమికి 20 కిలోమీటర్ల ఎత్తులో- 12 మీటర్లు ఎత్తు ఉండే బెలూన్లు ఎగురుతూ- నెట్ సౌకర్యాన్ని అందరికీ అందిస్తాయి. అంతేకాదు. బెలూన్లపై ఉండే టర్బయిన్ల ద్వారా పవన విద్యుత్‌ను ఉత్పత్తి చేసి దానిని భూమిపైకి ప్రసారం చేసే ప్రాజెక్టు కూడా 'ఎక్స్' పరిశోధనల్లో రూపుదిద్దుకుంటోంది. ఇంతకు ముందు ఈ తరహాలో విద్యుత్‌ను ఉత్పత్తి చేసిన- మకానీ పవర్ అనే కంపెనీని గూగుల్ గత ఏడాది కొనుగోలు చేసింది. 'ఎక్స్' పరిశోధనాశాలల్లోకి ఈవిధంగా వచ్చి చేరిన మరో ఆలోచన- మానవ చోదక రహిత కారు.

కాలిఫోర్నియాలో ఒక రోజు కారులో ప్రయాణిస్తున్న సమయంలో- అసలు డ్రైవర్ లేకుండా, మ్యాప్‌లు, జీపీఎస్, లేజర్ల ద్వారా కార్లను ఎందుకు నడపలేమనే ఆలోచన వచ్చిందట. దానికి రూపమే డ్రైవరు రహిత కారు. 'రోబో కార్స్' అని పిలిచే ఈ వాహనాలు, జీపీఎస్, గూగుల్ మ్యాప్స్, లేజర్ టెక్నాలజీల ఆధారంగా పనిచేస్తాయి. వీటిని కాలిఫోర్నియా, నవాడా, ఫ్లోరిడాలలో ఇప్పటికే ఐదు లక్షల మైళ్లు నడిపి చూశారు. మరో ఐదేళ్లలో వీటిని మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నారు. ఇవన్నీ ఒక ఎత్తైతే కేలికో మరో ఎత్తని చెప్పాలి. దీనిని ఒక ప్రత్యేక కంపెనీగా ఏర్పాటుచేస్తున్నామని పేజ్ ప్రకటించినా- దీనికి అవసరమైన నిధులన్నీ గూగుల్ నుంచే వస్తాయని అందరికీ తెలిసిన విషయమే. విమర్శకులందరూ ఈ కొత్త కంపెనీపై దృష్టి సారించటానికి మరొక కారణం కూడా ఉంది.

వ్యాధుల కట్టడికి...
వృద్ధాప్యం లేకుండా నిరంతర యవ్వనంతో ఉండాలనేది మానవుడి చిరకాల ఆశ. దీనిపై ఎప్పటినుంచో ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. 1992లో అమెరికాలో కొందరు శాస్త్రవేత్తలు కలిసి- 'అకాడమీ ఆఫ్ యాంటీ ఏజింగ్ మెడిసిన్' అనే సంస్థను స్థాపించారు. అయితే ఈ సంస్థ ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. దాదాపు పదేళ్ల క్రితం సిట్రిస్ ఫార్మాసుటికల్స్ కంపెనీ- 'ఎస్ఆర్‌టీ501' అనే మందును తయారుచేసింది. వైన్‌లో దొరికే రిజర్వాట్రాల్ అనే పదార్థం ఆధారంగా దీనిని తయారుచేశారు. ఇది మన శరీరంలో రక్తకణాలు ఎక్కువ కాలం బతికేలా చేస్తుంది. ఈ మందు ప్రయోగాత్మక దశలో ఉండగానే- 2008లో గ్లాస్కోస్మిత్‌లైన్ అనే సుప్రసిద్ధ ఫార్మాసుటికల్ కంపెనీ - సిట్రస్‌ను 7.2 కోట్ల డాలర్లకు (దాదాపు రూ. 450 కోట్లు) కొనుగోలు చేసింది.

ఈ మందు విజయవంతమయితే తాము పెట్టిన పెట్టుబడికి వెయ్యి రెట్లు వస్తుందని గ్లాస్కోస్మిత్‌లైన్ భావించింది. అయితే ఈ మందు సమర్థవంతంగా పనిచేయటం లేదని తేలింది. దీనితో 2010లో కంపెనీని మూసేశారు. అలాంటి సమయంలో క్యాన్సర్, వృద్ధాప్యం వంటి సమస్యలపై గూగుల్ దృష్టి పెట్టడానికి రెండు కారణాలున్నాయి. మొదటిది అత్యంత క్లిష్టమైన సమస్యలకు వెతికితే సులభమైన పరిష్కారాలు దొరుకుతాయనే పేజ్ సిద్ధాంతం. రెండోది ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీ. ప్రతి సమస్యను చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టి.. అందుబాటులో ఉన్న టెక్నాలజీ ద్వారా ప్రయత్నిస్తే పరిష్కారం దొరుకుతుందనేది గూగుల్ మూలసూత్రం. గూగుల్ సెర్చ్ ఇంజన్ మొదలుకుని వారు తాజాగా విడుదల చేసిన నాలెడ్జ్‌గ్రాఫ్ దాకా అన్నింటిలోను అంతఃసూత్రమిదే.


మానవుడి ఆయుష్షు పెంచడానికి...
క్యాన్సర్, వృద్ధాప్యాలకు సంబంధించి- ప్రపంచవ్యాప్తంగా టన్నుల కొద్దీ సమాచారం అందుబాటులో ఉంది. వీటిని విశ్లేషించగలిగిన శక్తి ఉన్న సూపర్ కంప్యూటర్లు కూడా ఉన్నాయి. అందుబాటులో ఉన్న సమాచారాన్ని క్రమపద్ధతిలో పెట్టి, దానిని విశ్లేషించి- ఆ విశ్లేషణను ముక్కముక్కలుగా విడగొడితే పరిష్కారం తప్పకుండా దొరుకుతుందని గూగుల్ భావిస్తోంది. దీనికి తోడు గత ఏడాది గూగుల్ '23 అండ్ మీ' అనే కంపెనీలో పెట్టుబడులు పెట్టింది. ఈ కంపెనీ వివిధ వ్యాధులు రావటానికి జన్యుపరమైన కారణాలను కనుగొనే పరిశోధనలు చేస్తుంది. ఒక వైపు తమ వద్ద ఉన్న టెక్నాలజీని, మరో వైపు జన్యుశాస్త్రంలో వస్తున్న అభివృద్ధిని మేళవిస్తే- క్యాన్సర్, వృద్ధాప్యం వంటి చిక్కుముడులు వీడుతాయనేది పేజ్ వాదన. ఒకసారి వీటిని పరిష్కరించగలిగితే ఆ తర్వాత వాటికన్నా ప్రమాదకరమైన జబ్బులపై దృష్టి పెట్టవచ్చని- అప్పుడు మానవుడి ఆయుష్షు పెరుగుతుందని పేజ్ పేర్కొంటున్నాడు.

విమర్శలూ ఉన్నాయి
అందరి జీవితాలతోను ఏదో ఒక విధంగా పెనువేసుకుపోయిన గూగుల్ విధానాలపై అనేక విమర్శలు కూడా ఉన్నాయి. గూగుల్ సమాచారాన్ని తనకు నచ్చిన విధంగా నియంత్రించటానికి ప్రయత్నిస్తోందని చాలా కాలంగా విమర్శకులు అంటున్నారు. తాజాగా గూగుల్ ప్రైవసీ విధానంలో చేసిన మార్పులపై ప్రపంచవ్యాప్తంగా అనేక మంది విరుచుకుపడుతున్నారు. మారిన విధానం ప్రకారం- తన సేవలను ఉపయోగించుకొనేవారి పేర్లను, ఫోటోలను ఉపయోగించే హక్కు గూగుల్‌కు ఉంటుంది. ప్రస్తుతం గూగుల్ సెర్చ్ ఇంజన్లు కోట్ల మంది వినియోగదారులకు అనుక్షణం దాదాపు 20 లక్షల వెబ్‌సైట్లను వెతికి సమాచారాన్ని అందిస్తూ ఉంటాయి. ఈ సమాచారాన్ని అందించే సమయంలో గూగుల్ అనేక ఉత్పత్తులకు సంబంధించిన ప్రకటనలను కూడా వినియోగదారులకు అందిస్తుంది.

ఈ ప్రకటనలలో తమ సేవలను ఉపయోగించుకొనే వినియోగదారుల ఫోటోలను వాడాలని గూగుల్ విధాన నిర్ణయం తీసుకుంది. అయితే ఇది వ్యక్తిగత స్వేచ్ఛకు విఘాతం కల్గించటమేనని ఇంటర్నెట్ హక్కుల కార్యకర్తలు విమర్శిస్తున్నారు. దీనిపై కన్స్యూమర్ యూనిటీ అండ్ ట్రస్ట్ సొసైటీ (సీయూటీఎస్ ఇంటర్నేషనల్) అనే సంస్థ- కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు కూడా చేసింది. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ ఫిర్యాదుపై విచారణ కూడా ప్రారంభించింది. అయితే ఈ ఆరోపణలు కేవలం అపోహలేనని గూగిల్ వాదిస్తోంది. తాము వినియోగదారులకు ప్రైవసీ పాలసీ గురించి ముందే చెప్పామని.. తమ ఫోటోలు వెబ్‌లో ప్రచారం కావటం ఇష్టం లేని వారు.. పాలసీలో ఆ ఆప్షన్‌ను తొలగించుకోవచ్చని పేర్కొంటోంది. అంతే కాకుండా- ఈ ప్రకటనలు అందరికీ కనిపించవని, వినియోగదారుడి సోషల్ సర్కిల్‌లో ఉన్నవారికి మాత్రమే కనిపిస్తాయని.. అందువల్ల అది వ్యక్తిగత స్వేచ్ఛకు ఏ విధంగా భంగం కాదని వాదిస్తోంది.

వైఫల్యాలూ ఉన్నాయ్...
గూగుల్ చరిత్రను జాగ్రత్తగా గమనిస్తే- గూగుల్ చేసిన అన్ని ప్రయోగాలూ విజయవంతం కాలేదు. కొన్ని విఫలం కూడా అయ్యాయి. గూగుల్ హెల్త్, బజ్ వంటివి ఆదరణ పొందలేదు. ఇలాంటి పరాజయాలెదురయినప్పుడు- ఈ సర్వీసులను గూగుల్ వెంటనే తొలగిస్తుంది. ప్రతిష్ఠ కోసం కొనసాగించదు. ముఖ్యంగా మూడు అపజయాలున్నాయి. గూగుల్ హెల్త్ - ప్రపంచంలో ఉన్న అందరి ఆరోగ్యరికార్డులు భద్రపరచాలనేది దీని ఉద్దేశం. 2008లో మొదలైన ఈ ప్రాజెక్టు పూర్తిగా విఫలమయింది. 2011లో దీనిని మూసేశారు. గూగుల్ వేవ్- ఈమెయిల్‌ను, మెసేజింగ్‌ను కలిపే ప్రయత్నం. 2009లో మొదలైన ఇది కూడా విఫలమయింది. గత ఏడాది మూసేశారు. గూగుల్ బజ్ - ట్విట్టర్ తరహా సేవ ఇది. ఇది జీమెయిల్ ద్వారా పనిచేస్తుంది. అయితే ఇది కూడా విఫలమయింది. 2010లో మొదలెట్టిన దీనిని 2011లో మూసేశారు.

ఈ తొలగించే పద్ధతినే పేజ్ ముద్దుగా 'స్ప్రింగ్ క్లీనింగ్' అని పిలుస్తాడు. ప్రతి రెండు, మూడేళ్లకు ఇలాంటి క్లీనింగ్ నడుస్తూనే ఉంటుంది. " నేను చాలా ఆశావాదిని. ప్రతి విషయం త్వరగా పూర్తవుతుందనే ఆశతోనే ఉంటా. కొన్ని సార్లు నేను అనుకున్న సమయం కన్నా ఎక్కువ పడుతుంది. ఉదాహరణకు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ తయారుచేయటానికి ఏడాది చాలనుకున్నా. కానీ దానిని తయారుచేయటానికి ఐదేళ్లు పట్టింది. ప్రపంచంలో ఉన్నవారందరూ తమ హెల్త్ రికార్డులను గూగుల్‌లో దాచుకుంటారనుకున్నా. అది పూర్తిగా విఫలమయింది. అయినా పరాజయం ఎదురయినప్పుడల్లా- వందరెట్లు ఉత్సాహంతో ముందుకు పరిగెత్తడానికి ప్రయత్నిస్తా'' అంటాడు పేజ్.
Courtesy-Andhrajyothy

desire to work in the village

It was the desire to work in the village that brought Gyanesh Pandey, an electrical engineer from Banaras Hindu University (BHU), to Bihar from Los Angeles where he was working as a senior yield enhancement engineer with a company called International Rectifier. Pandey established Husk Power System (HPS), which uses rice husk to generate electricity, with Manoj Sinha and Ratnesh Yadav who were looking for a technology to fit their model for six years. Sinha is an electronics engineer, who is now based in the US while Yadav is involved at the ground level with Pandey. Today, HPS supplies eight to 10 hours of power to 18,500 households in some of the off-grid villages, where the state-run electricity board doesn't reach. Over 1.5 lakh rural Indians benefit from this and around 250 people are employed. Sudhir K. Singh, director, Ministry of New and Renewable Energy, says, "He is a rare mix of commitment, vision and management skills."

The Mission To make villages in India livable. Their NGO, Samta Samriddhi Foundation, supports the education of over 250 children at Tamkuha. They also employ women to make incense sticks using plant byproduct.

The Challenge To find sustainable technology to achieve rural growth. "Managing people at ground level is tough. We have created a paradigm. We have to now sustain it."

JCI Hyderabad Synergy For seva

JCI Hyderabad Synergy is back with the biggest community street program for people sleeping on footpath. We are distributing clothes and blankets to the needy on footpath on 23rd Nov 2013 from10pm onwards from Secbad Railway Station to Charminar.

FOR CONTRIBUTIONS @

Secbad Side:
Jc Aman : 9014295529
Jc Dhruv : 8885177752

Hyderabad Side:
Jc Harsh : 9700202003
Jc Nikhil : 9030263621

Request you to kindly contribute and share the post..

Also Register yourself on www.jcihydsynergy.org to receive the updates on the activities.

Thank You
Team - JCI Hyderabad SYNERGY

Success Story of a Govt School Student

హైటెక్‌సిటీ చెంతన ఓ బస్తీలోని ఇరుకు గదిలో నివాసం. తండ్రి కూలీ. తల్లి హౌస్‌కీపర్. వీరి అబ్బాయి నర్సింహ విద్యా ప్రమాణాలు మచ్చుకైనా లేని ప్రభుత్వ పాఠశాల విద్యార్థి. అయితేనేం.. ప్రతిభకు అవేవీ ఆటంకం కావని నిరూపించాడు. లక్షలకు లక్షలు పోసి కార్పొరేట్ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులతో పోటీపడి ఆంగ్లభాషా ప్రావీణ్యంలో విజయకేతనం ఎగురవేశాడు. భవిష్యత్తులో పోలీస్ అధికారి కావాలనుకొంటోన్న ఆ విద్యార్థి సక్సెస్ స్టోరీ..

సున్నాల్లేని గోడలు, గొళ్లాల్లేని తలుపులు... ఇరుకిరుకు గదులు, సమయానికి రాని మాస్టార్లు, నాణ్యతలేని మధ్యాహ్న భోజనం... అరకొర చదువులు... ప్రభుత్వ పాఠశాలలు అనగానే అందరికీ గుర్తుకువచ్చే దుస్థితి. అయితే అలాంటి పరిస్థితుల నుంచి కూడా విశేషమైన విజయాలు పుట్టుకొస్తాయి. అలాంటి విజయం సాధించిన బాలుడు నర్సింహ... ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ‘ఇంటలిజెన్స్’ ముందు దిగదుడుపే అని నిరూపించాడు. రూ.లక్షలు చెల్లించి చదివే విద్యార్థులతో పోటీపడి గెలిచాడు. అది కూడా తెలుగు మీడియం విద్యార్థులను అనుక్షణం భయపెట్టే ఆంగ్లభాషా ప్రావీణ్యంలో...

పేదింట్లో విద్యా కుసుమం వికసించింది. తెలుగు భాషలో విద్యా బుద్ధులు నేర్చుకుంటున్న ఓ బాలుడు శుక్రవారం ఆంగ్ల పదజాలంలో నిర్వహించిన పోటీల్లో కార్పొరేట్ విద్యార్థులను తోసిరాజన్నాడు. మొదటి స్థానంలో నిలిచాడు. మారుమూల గ్రామం నుంచి వలస వచ్చిన నిరుపేద దంపతుల కుమారుడు రూ.50 వేలు నగదు గెలుచుకున్నాడు.

ఇంటిల్లిపాదీ పని... ఒక్కడి చదువు...
మెదక్ జిల్లా కంగ్టి మండలం దేగులవాడి గ్రామానికి మార్జోడి మారుతి ఇరవై ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం హైదరాబాద్ వలస వచ్చాడు. భార్య లలితమ్మ, కొడుకులు రవికుమార్, నర్సింహలతో కలిసి గచ్చిబౌలిలోని సిద్దిఖ్‌నగర్‌లో నివాసముంటున్నారు. తండ్రి కూలి పనులు చేసుకుంటుండగా, తల్లి లలితమ్మ, సోదరుడు రవికుమార్‌లు హైటెక్‌సిటీలోని ఓ కంపెనీలో హౌస్ కీపింగ్ పనులు చేస్తున్నారు.

ముగ్గురు పనిచేస్తేనే తప్ప ఇల్లు గడవని పరిస్థితి. వేల రూపాయలు ఖర్చు పెట్టి ప్రైవేట్ పాఠశాలల్లో చదివించే స్థోమత లేక చిన్న కొడుకు నర్సింహను అంజయ్యనగర్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చేర్పించారు. ప్రస్తుతం నర్సింహ అక్కడ 5వ తరగతి చదువుతున్నాడు. తల్లిదండ్రుల కష్టం అర్థమైనట్టు... చదువులో రాణిస్తున్న నర్సింహ క్లాస్‌లో అన్నింటా ఫస్ట్ కావడంతో ఆంగ్లభాషా ప్రావీణ్యంపై విద్యార్థులకు పోటీలు నిర్వహించే అట్లాంటా ఫౌండేషన్ దృష్టిని ఆకర్షించాడు. దీంతో నర్సింహకు ఆంగ్ల పదజాలంలో కొంతకాలం పాటు శిక్షణ ఇచ్చారు.

ఔరా..!
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కూడా పోటీలలో ప్రాతినిధ్యం ఉండాలనే ఉద్దేశంతో నర్సింహను ఎంపిక చేస్తే... ఏకంగా విజేతగా నిలిచి నర్సింహ అందర్నీ ఆశ్చర్యంలో ముంచాడు. అల్లిబిల్లిగా ఉండే ఆంగ్ల అక్షరాలతో పదాలను కూర్చడం, ఉచ్ఛరించిన ఆంగ్లపదాల స్పెల్లింగులు కరెక్ట్ చేయడం... వంటి విభిన్న రకాల అంశాలతో నిర్వహించిన ఈ పోటీకి నగరానికి చెందిన దాదాపు అన్ని టాప్ క్లాస్ కార్పొరేట్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు హాజరయ్యారు. ఈ పోటీలో కార్పొరేట్ పాఠశాల విద్యార్థులకు దీటుగా ల్యాప్‌టాప్‌పై సమాధానాలు ఇస్తూ నర్సింహ ముందు వరుసలో నిలిచాడు.

చివరకి... మాదాపూర్‌లోని మహీంద్రా సత్యంలో శుక్రవారం అట్లాంటా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘లెర్నేసియం ఓపెన్ వొకాబ్ కాంటెస్ట్- 2013-14’ ఫైనల్స్‌లో అందర్నీ తోసిరాజని... అంజయ్యనగర్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల తరఫున ప్రైమరీ స్కూల్ విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచాడు. ప్రశంసా పత్రం, మెమొంటోతో పాటు రూ.50 వేల నగదు పురస్కారాన్ని సైతం దక్కించుకున్నాడు.

ఎంతో సంతోషంగా ఉంది...
పెద్ద పాఠశాలల్లో చదివే పిల్లలతో పోటీపడి తమ కొడుకు ఛాంపియన్‌గా నిలవడంపై తల్లిదండ్రులు మారుతి, లలితమ్మలు ఆనందం వ్యక్తం చేశారు. చదువంటే ఎంతో ఇష్టమని, అయినా ప్రైవేట్ స్కూల్‌లో చదివించే స్థోమత తమకు లేదన్నారు. బాగా చదువుకొని మంచి ఉద్యోగం సాధించాలని కోరుకుంటున్నామని తెలిపారు.

మంచి ఉద్యోగమే లక్ష్యం...
బాగా చదువుకొని మంచి ఉద్యోగం సాధించాలని తాను భావిస్తున్నట్లు విద్యార్థి నర్సింహ తెలిపారు. పోలీస్ ఆఫీసర్ కావాలనుకుంటున్నట్లు వెల్లడించారు. మొదట్లో ఇంగ్లిష్‌లో చదవాలంటే భయం వేసేదని చెప్పారు. ఆ తరువాత మేడం రోజూ క్లాస్ తీసుకోవడంతో భయం పోయిందన్నారు.

సృజనాత్మకతను వెలికి తీసేందుకే...
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లోనూ ప్రతిభకు కొరత ఉండదు. పేద విద్యార్థులకు ఆంగ్ల భాషలో శిక్షణ ఇస్తున్నాం. వారిలోని సృజనాత్మక శక్తిని వెలికి తీసేందుకే అట్లాంటా ఫౌండేషన్ కొంత కాలంగా కృషి చేస్తోంది. ఛాంపియన్‌గా నిలిచిన అంజయ్యనగర్‌లోని ప్రైమరీ స్కూల్ విద్యార్థి నర్సింహకు నేనే శిక్షణ ఇచ్చా. ఆత్మ స్థైర్యంతో పోటీపడి విజయం సాధించాడు.
- శేషు, అట్లాంట ఫౌండేషన్

Wednesday, 30 October 2013

State Wise links for online Voter Regisration:

Jammu & Kashmir - http://ceojk.nic.in/
Gujarat - http://ceo.gujarat.gov.in/
Uttar Pradesh - http://ceouttarpradesh.nic.in/
Bihar - http://ceobihar.nic.in/
Haryana - http://ceoharyana.nic.in/
Karnataka - http://ceokarnataka.kar.nic.in/
Maharashtra - http://103.23.150.75/Default.aspx
Andhra Pradesh - http://www.ceoandhra.nic.in/ceonew/home.aspx
Tamil Nadu - http://ceotamilnadu.nic.in/
Kerala - http://www.ceo.kerala.gov.in/
Orissa - http://ceoorissa.nic.in/
Chattisgarh - http://ceochhattisgarh.nic.in/
Madhya Pradesh - http://ceomadhyapradesh.nic.in/
Uttarakhand - http://ceo.uk.gov.in/
Rajasthan - http://www.ceorajasthan.nic.in/index.aspx
Delhi - http://ceodelhi.gov.in/
Assam - http://ceoassam.nic.in/
Mizoram - http://ceomizoram.nic.in/
Punjab - http://ceopunjab.nic.in/
Arunachal Pradesh - http://ceoarunachal.nic.in/
Himachal Pradesh - http://ceohimachal.nic.in/
Jharkhand - http://www.jharkhand.gov.in/ceo/
Meghalaya - http://ceomeghalaya.nic.in/
Sikkim - http://ceosikkim.nic.in/
Tripura - http://ceotripura.nic.in/
West bengal - http://ceowestbengal.nic.in/
Puducherry - http://www.ceopondicherry.nic.in/index.asp

Your 1 Vote Can Change Future of India, Please Register your self and Vote for Better India.
Courtesy-Yuva nirmaan
 

సాధించాల్సిన లక్ష్యానికి చేరుకోవాలంటే

ఏదైనా సాధించాలన్న కోరిక, ఆత్రుత అందరిలోనూ వుంటాయి. కానీ అందులో కొంతమందే తమ లక్ష్యాల్ని సాధిస్తున్నారు. అనుకున్న లక్ష్యాన్ని సాధించలేక మొదటి అడుగులోనే ఆగిపోయేవారు ఎందరో.. దేశ జనాభాలో 45శాతం మంది యువతే. వీరంతా ఏదో సాధించాలిన తపన పడుతుంటారు. కొందరు చిన్న ఉద్యోగం సంపాదించి అదే జీవితం అనుకుంటారు. ఇలా మొదటి అడుగులోనే ఆగిపోయే చాలామంది మనసు పెడితే సమున్నత లక్ష్యం సొంతం చేసుకోవటం ఏమంత కష్టం కాదు. సాధించాల్సిన లక్ష్యానికి చేరుకోవాలంటే ఇష్టమైన రంగాన్ని ఎంచు కొని ముందుకు సాగాలి. అవేమిటో ఒక్కసారి పరిశీలించండి మరి!
వ మీ ఏరియాలో ఇంతవరకూ ఎవరూ ప్రారంభించని అందరూ ఎవరైనా పెడితే బాగుణ్ణు అని ఎదురుచూసే వ్యాపారాలేమైనా ఉన్నాయా అని పరిశీలించండి. అలాంటి వ్యాపారం ప్రారంభిస్తే తప్పకుండా గెలవడం తథ్యం! ఉదాహరణకి కొరియర్ సర్వీస్, మొబైల్ లెండింగ్ లైబ్రరీ, అలాగే ఇల్లు మారినపుడు మీ సామాను అంతా చక్కగా ప్యాక్ చేసి వేరేచోటికి మార్చే ‘ప్యాకర్స్ మరియు మూవర్స్’ అనేవి అతి కొద్దికాలంలోనే ఎంతగా ప్రాచుర్యం పొందాయో అందరికీ తెలిసిన విషయమే!
వ ఏ విషయాన్నైనా పాజిటివ్‌గా తీసుకునే అలవాటుని చేసుకోండి. దీనివల్ల జీవితంలో ఎలాంటి కష్టనష్టాలు ఎదురైనా తేలిగ్గా ఎదుర్కోవచ్చు. గజనీ మహమ్మద్ ఇరవై ఏడుసార్లు ఓడిన తర్వాతే మన దేశంపై విజయం సాధించగలిగాడు. అబ్రహం లింకన్ ఎన్నో కష్టాల్ని అనుభవించిన తర్వాత అమెరికాకి ప్రెసిడెంట్ అవగలిగాడు. మనిషికి ఆత్మవిశ్వాసం, గెలుస్తాం అన్న నమ్మకం వుంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చు
వ దృఢ సంకల్పం చేసే పని మీద పూర్తి అవగాహన మనకి చాలా ముఖ్యం! వాళ్లు చెప్పారు, వీళ్లు చెప్పారు అని వాళ్లూ, వీళ్లూ చెప్పినవి విని చేసి, ఆ తర్వాత నష్టం వస్తే నష్టం ఒక్కటే కాదు, అనుబంధాలు కూడా. అందువల్ల ఏదైనా ఒక పనిని ప్రారంభించేముందు ఎవరి మాటలూ వినకుండా మీకు మీరుగా దాని గురించి బాగా తెలుసుకుని, ఆ పనివల్ల నష్టాలెన్ని, లాభాలెన్ని అని బాగా బేరీజు వేసుకుని ప్రారంభించండి. ఒకవేళ అనుకోకుండా ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడా నష్టం వస్తే, ఇలా కూడా నష్టం వచ్చే పరిస్థితి వుందని తెలుసుకుని దాన్ని అధిరోహించడానికి ప్రయత్నించండి!
వ ఏదైనా సాధించాలంటే ముందుగా కావలసింది ఇంటిలోని వాళ్ల ప్రోత్సాహం! అంతేకాకుండా ఎలాంటి సమస్యనైనా మీరే పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. అంతేకాని ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని కూర్చుంటే మాత్రం నష్టపోయేది మీరే!
వనిజాయితీగా వుండండి. లక్ష్యసాధనకి నిజాయితీ చాలా ముఖ్యం. ఎదుటివాళ్లదగ్గర మనం నిజాయితీపరులమని, మాట కచ్చితం కలవారమని నిరూపించుకుంటే చాలు- మన పనుల్లో గానీ, వ్యాపారంలోగానీ ఎంత ఎత్తుకి ఎదగగలమో మీకే తెలుస్తుంది.
వ అనుకున్నది సాధించాలన్న ఆశ, దానికోసం పడే తాపత్రయం మాత్రమే లక్ష్యసాధనకి ఉపయోగపడదు. మీలోనూ మార్పు కనిపించాలి. ఎపుడు చూసినా సీరియస్‌గా వుండకూడదు. గలగలా నవ్వుతూ అందర్నీ నవ్విస్తూవుండాలి. మీ దగ్గర పనిచేసే వాళ్లతో కలిసిపోతూ, అందర్నీ కలుపుకుని పోతే మీ లక్ష్యసాధన చాలా తేలికైపోతుందన్నది ముమ్మాటికీ నిజం!
వ ఈ సందర్భంలో మనం ప్రఖ్యాత ఇంజనీర్ మోక్షగుండం విశే్వశ్వరయ్య చెప్పిన మాటల్ని గుర్తుచేసుకోవాలి. ‘‘నేనొక రోడ్లు ఊడ్చే పనివాడినయితే ప్రపంచంలోనే అత్యుత్తమ రోడ్లు ఊడ్చే పనివాడినని పేరు తెచ్చుకోవడానికి కృషి చేస్తాను. నన్ను మించిన వాళ్లు ఈ ప్రపంచంలోనే లేరన్నట్లుగా పేరు తెచ్చుకుంటాను’ అన్న మాటల్లో నిజమెంత దాగుందో తెలుసుకోవాలి. మనం చేసే పని ఎటువంటిదయినా అందులో నూటికి నూరు శాతం మన మనస్సుని కేంద్రీకరించి చేసినపుడు విజయం మనదే అవుతుంది.
వ సాధించాలన్న కోరిక వున్నపుడు, మనమీద వచ్చే విమర్శల్ని పట్టించుకోకూడదు. ఎప్పుడూ ఎవరో ఒకరిపైన, ఏదో ఒకటి చెబుతూనే వుంటుంది లోకం! విమర్శలు వచ్చినపుడే మనస్సుని కంట్రోల్ చేసుకోవాలి. విమర్శలకి క్రుంగిపోవడం, పొగడ్తలకి పొంగిపోవడం చెయ్యక, సాధించి తీరాలన్నదే లక్ష్యంగా పెట్టుకుని పోయినపుడు ఈ విమర్శకులెవరూ కనిపించకుండా పోతారు.
లక్ష్యసాధనలో చాలా ముఖ్యమైనది నమ్మకం! ముందు మన మీద, మనం చేసే పనిమీద మనకి గాఢ నమ్మకం వుండాలి. మనలోని బలం ఏమిటి? బలహీనతలు ఏమిటి? అన్నవి తెలుసుకుని, బలహీనతల్ని అధిగమించడానికి ప్రయత్నించినపుడు విజయం మీ చెప్పుచేతల్లో వుంటుందన్నది నిజం!
వ ఒకేసారి రెండు మూడు పనుల్ని చెయ్యాలనుకోకూడదు. అందువల్ల మనం పనుల్ని సరిగ్గా చెయ్యలేకపోవడమో లేక ఏదో గెలిచామన్న పేరుకి గెలవడమో జరుగుతుంది. అంతేకాని ఎందులోనూ గొప్పగా పేరు తెచ్చుకోలేము. అందరూ, అన్నింటిలోనూ గొప్పగా రాణించడమన్నది అసాధ్యం! ఎవరికీ సాధ్యపడదు కూడా. అందువల్ల సాధ్యమైనంత వరకూ సాధించాలని అనుకున్న ఒక్కదానిలో నిష్ణాతులైన వుండడానికి ప్రయత్నించండి.
కలలు కనండి కలలే మీరు సాధించబోయే అపూర్వ విజయాలకి పునాదులు. కలల ద్వారా పొందే ఉత్సాహమే మిమ్మల్ని లక్ష్యసాధన వైపుకి దూసుకుని వెళ్లేలా చేస్తుంది.
తర్వాత ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి? అన్న తలంపు ఎప్పుడు వుంటుండాలి. ఈ తలంపు లేనందువల్లే చాలామంది ఎదుగూ బొదుగూ లేకుండా వున్న సీట్లో అలాగే వుండిపోవడం జరుగుతుంది.
పైన చెప్పిన విషయాలన్నీ గుర్తుంచుకుని ఆచరిస్తే తప్పకుండా లక్ష్యసాధనలో మీరే ముందుంటారన్నది ముమ్మాటికీ నిజం!
Courtesy-AndhraBhoomi

యువతలో నైపుణ్య వికాసానికి ఎన్‌ఎస్‌డిసి సూచనలు

ఇరవై ఐదేళ్ల సురేష్ ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక చిన్న ఉద్యోగంలో చేరాడు. అతనిలో తీవ్ర అసంతృప్తి. ఆశలేమో ఆకాశమంతా విస్తరించాయి. కాని అవకాశాలు లేవనే నిరాశ నిస్పృహలతో తనలో దాగి ఉన్న నైపుణ్యానికి పదును పెట్టకుండా, చిన్న ఉద్యోగంలో ఏర్పడిన అసంతృప్తిని కొండంత సమస్యగా ఊహించుకొని తాగుడుకు బానిస అయ్యాడు. ఎంతమంది చెప్పినా అతనిలో మార్పులేదు. అతని వల్ల కన్నవారికి సైతం నిత్యం శారీరక, మానసిక బాధలే. ఇలా నేటి యువతరం తమలో దాగిఉన్న నైపుణ్యానికి పదును పెట్టకుండా నిర్వీర్యం అవుతోంది. వాస్తవానికి యువత తలచుకుంటే సాధించలేనిది లేదు. దేశంలో 45శాతం మంది యువతే ఉంది. చురుకుగా, చలాకీగా, ఆరోగ్యం, ఆనందోత్సవాలకు అవధలు లేకుండా ప్రవాహం వలే సాగిపోవాలి. స్నేహాలు, సరదాలు వారి జీవితంలో ఓ భాగమైతే, ఉపాధి కూడా మరో భాగం కావాలి. ఆర్థికమాంద్యం నెలకొన్న నేటీతరుణంలోఉద్యోగాలకు కోతపడుతున్న వేళ సురేష్‌లాంటి వాళ్లు నైపుణ్యానికి పెద్దపీట వేస్తే రాబోయో కాలంలో ఎన్నో విజయాలను సొంతం చేసుకోవటమే కాదు డబ్బు, సంఘంలో హోదాను సంపాదించుకోవటం ఏమంతా సాధ్యంకానిది కాదు. ఇందుకు అవసరమైన సామర్థ్యాలను, సాఫ్ట్ స్కిల్స్‌ను పెంపొందించుకోవాలి. పరుగులు తీసే క్రమంలో తమ ప్రాధాన్యాలలో మార్పులు చేసుకుంటూ ఆల్‌రౌండర్‌గా ఎదగటానికి ప్రయత్నించాలి.
యువతలో నైపుణ్యం వృద్ధి చెందేలా తగిన కార్యాచరణ ప్రణాళికల్ని అమలు చేస్తే 2022 నాటికి ఉపాధి అవకాశాలను భారీగా మెరుగుపరచే అవకాశం ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. జాతీయ నైపుణ్య అభివృద్ధి సంస్థ (ఎన్‌ఎస్‌డిసి) ఆధ్వర్యంలో జరిగిన అధ్యయనం సందర్భంగా ప్రభుత్వ,ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో 2022 నాటికి సుమారు 500 మిలియన్ల మందికి వృత్తి విద్యలో ఉపాధి కల్పించవచ్చని అంచనా వేశారు. వౌలిక వసతుల కల్పన, ఉపాధి అవకాశాలు పెంచడం- అనే రెండు సవాళ్లను అధిగమించాలంటే పెద్ద ఎత్తున నిధులను సమీకరించాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రైవేటు, ప్రభుత్వ సంస్థల భాగస్వామ్యం ఎంతగానో ఉపకరిస్తుంది. వృత్తివిద్యలో యువత రాణించినపుడే ఉపాధి అవకాశాలు విస్తృతమవుతాయి. 2022 నాటికి 500 మిలియన్ల యువతీ యువకులు ఉపాధి పొందాలంటే కొన్ని నిర్దిష్ట ప్రణాళికలను అమలు చేయాలని ఎన్‌ఎస్‌డిసి సూచించింది. గ్రామీణ ప్రాంతాలు, అల్పాదాయ వర్గాలకు చెందిన వారికి వృత్తి విద్యలో మెళకువలను నేర్పాలి. ఉపాధి అవకాశాలు విరివిగా ఉండే ఉత్పత్తుల రంగాన్ని మరింతగా ప్రోత్సహించాలి. మార్కెట్ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ వృత్తి విద్యలో నైపుణ్యం పెంపొందించేందుకు యువతకు తగిన శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించాలని ఎన్‌ఎస్‌డిసి ఎండి, సిఇఓ దిలీప్ షెనాయ్ సూచిస్తున్నారు. యువతలో నైపుణ్యం పెరిగేలా అవసరమైన వ్యూహాలను అనుసరించాలని, మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా వృత్తి విద్యలో కొత్త పద్ధతులను ఆవిష్కరించాలని ఆయన అభిప్రాయపడ్డారు. వృత్తి విద్య కోర్సుల్లో చేరి కొన్ని కారణాల వల్ల మధ్యలోనే మానేస్తున్న వారిని గుర్తించి, చదువు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. పలు ప్రోత్సాహకాలు, ఆర్థిక సహాయం అందిస్తే వృత్తివిద్యపై ముఖ్యంగా గ్రామీణ, పేద వర్గాల యువత ఆసక్తి పెంచుకునే వీలుంది. యువతలో నైపుణ్య వికాసానికి ఎన్‌ఎస్‌డిసి పలు సూచనలు చేసింది.
* గ్రామీణ, బడుగువర్గాలకు చెందిన యువతీ యువకులకు ఉపాధిపై భరోసా ఇచ్చేందుకు వృత్తి విద్యను ప్రోత్సహించాలి. 15 ఏళ్లు నిండిన వారందరికీ వృత్తి విద్యా కోర్సులు అందుబాటులో ఉంచాలి. తొందరగానే సంపాదన మార్గాలు ఎంచుకునేందుకు, జీవితంలో స్థిర పడేందుకు వృత్తివిద్య ప్రాధ్యాన్యంపై యువతలో అవగాహన పెంచాలి.
* ఉత్పత్తి రంగంలో ఉపాధి లభించేలా కొత్త కోర్సులను ప్రారంభించాలి. వీలైనంత వరకూ స్వల్పకాలిక కోర్సులను అందుబాటులో ఉంచాలి. ఈ కోర్సులను పూర్తి చేసిన వారికి ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో సులువుగా ‘అప్రెంటిస్ షిప్’ లభించేలా ఏర్పాట్లు చేయాలి. దీర్ఘకాలిక కోర్సుల పట్ల యువత విసుగు చెందే అవకాశం ఉన్నందున, వీలైనంత తక్కువ వ్యవధిలో వృత్తి విద్య ముగిసేలా చూడాలి.
* కంప్యూటర్ల వినియోగం, ఆంగ్ల భాషలో ప్రావీణ్యం, సామాజిక పరిస్థితులపై అవగాహన తదితర విషయాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఉపాధికి వీలుండే కోర్సులపై తగిన సమాచారం అందుబాటులో ఉంచాలి.
* చిన్నతరహా పరిశ్రమల సహకారంతో అప్రెంటిస్ షిప్ పూర్తయ్యేలా ప్రభుత్వమే తగు ఏర్పాట్లు చేయాలి. శిక్షణ కాలంలో యువతకు ఆర్థిక సహాయం అందించాలి. శిక్షణ పూర్తయితే ఉపాధికి లోటుండదనే భద్రతా భావాన్ని యువతలో కల్పించాలి.
* వృత్తివిద్య కోర్సుల నిర్వహణను ప్రైవేటు, ప్రభుత్వరంగ సంస్థలు తమ బాధ్యతగా గుర్తించాలి. కెరీర్ పరంగా ఎదిగేందుకు వృత్తి విద్య కోర్సులు, నైపుణ్య వికాస పద్ధతులు మేలు చేస్తాయన్న నమ్మకం యువతలో ఏర్పడేలా చర్యలు తీసుకోవాలి.
Courtesy-Andhra bhoomi

Tuesday, 29 October 2013

సర్కారీ బడులో కార్పొరేట్ విద్య

సర్కారీ బడులో కార్పొరేట్ విద్య

Published at: 25-09-2013 07:02 AM
'ప్రభుత్వ పాఠశాలలు వద్దు - ప్రైవేటు బడులే ముద్దు' అన్న ఆలోచనను మన బుర్రల్లోంచి తీసెయ్యగలమా? 'అందరూ తలోచెయ్యీ వేస్తే అదెంతసేపు?' అంటున్నారు మెదక్ జిల్లా మందపల్లి గ్రామస్థులు. కేవలం అని ఊరుకోలేదు, ఆచరణలోనూ చూపించారు. వాళ్లందరి కృషి వల్ల కిందటేడు 48మంది పిల్లలున్న బడి ఇప్పుడు 142మంది పిల్లలతో కళకళలాడుతోంది.
మెదక్ జిల్లా చిన్నకోడూరు మండలంలోని మందపల్లి చిన్న ఊరు. అక్కడి ప్రాథమిక పాఠశాల అన్ని బడుల్లాగానే ఉండేది. కిందటేడు గట్టిగా యాభైమంది విద్యార్థులు కూడా లేరు. ఎక్కువమంది పిల్లలు దగ్గర్లోని సిద్ధిపేట ప్రైవేటు స్కూళ్లకు వెళ్లేవారు. ఈ విద్యాసంవత్సరం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిగా చేరిన మేఘమాలకు పరిస్థితి అర్థమయింది. తమ బడిని అన్ని హంగులతో తీర్చిదిద్దాలన్న పట్టుదల కనబరిచారామె. తోటి ఉపాధ్యాయులు వెంకట్‌రామ్‌రెడ్డి, పర్శరాములుగౌడ్ కూడా కలిసొచ్చారు. తల్లిదండ్రులు పిల్లలను ప్రైవేటు స్కూళ్లకు ఎందుకు పంపుతున్నారో ఆలోచించారు. అక్కడ విద్యుత్తు, ఫ్యాన్లు వంటి కనీస సౌకర్యాలుంటాయి, ఇంగ్లీషులో బోధన సాగుతుంది. ఇవి రెండూ ఉంటే బడి మెరుగవుతుందని ఆలోచించి ముందుగా ఒక ప్రణాళికను రూపొందించారు.
పెద్దలొచ్చారు...
ముందుగా సౌకర్యాల కోసం గ్రామ నాయకులను సంప్రదించారు ఉపాధ్యాయులు. పెద్దవాళ్లంతా పెద్దమనసు చేసుకున్నారు. జడ్పీటీసీ మాజీ సభ్యుడు దేవునూరి తిరుపతి 22 వేల రూపాయల ఖర్చుతో పాఠ్యపుస్తకాలు అందజేశారు. అల్లీపూర్‌కు చెందిన బండి ఆగయ్యగౌడ్ ఆరువేల విలువైన ఫ్యాన్‌లిచ్చారు. చేర్యాలకు చెందిన స్వచ్చంద సంస్థ మధ్యాహ్న భోజనం కోసం 200 ప్లేట్లు అందజేసింది. గ్రామ సర్పంచ్ అనసూయ పిల్లలకు టై, బెల్టులు పంపిణీ చేశారు. గ్రామంలోని జిందం కోమలశ్రీనివాస్, సిద్ధిపేటకు చెందిన పిల్లల వైద్యులు కె.శివరామచారి తదితరులు మైక్ సెట్, వాయిద్య పరికరాలు, క్రీడా సామాగ్రి మొదలైనవి ఇప్పించారు. అన్ని హంగులూ సమకూర్చుకున్నాక ఊళ్లోని పెద్దవాళ్లతో సమావేశమయ్యారు ఉపాధ్యాయులు.
నాణ్యతకే పెద్దపీట
'ప్రైవేటు చదువులంటే డబ్బు చాలా ఖర్చవుతుంది. రోజూ పైఊరికి వెళ్లి రావడమంటే మాటలు కాదు. ఈ వ్యయప్రయాసలు మీకెందుకు' అంటూ గ్రామస్థులకు నచ్చజెప్పారు. అందరూ సహకరిస్తే నాణ్యమైన విద్యను తామే అందిస్తామని హామీ ఇచ్చారు. తల్లిదండ్రులు అంగీకరించారు. ఉన్నత విద్యార్హతలున్న యువకులు విద్యావలంటీర్లుగా పనిచెయ్యడానికి ముందుకొచ్చారు. ఎమ్మెస్సీ బీఈడీ పూర్తి చేసిన డి.స్వామి, బీఎస్సీ బీఈడీ చదివిన డి.ప్రభాకర్, బిటెక్ అభ్యర్థి శ్యామ్, ఎంఎ తెలుగు చదువుకున్న బి.రాజులు వలంటీర్లుగా బడిలో చేరారు. వారికి ప్రభుత్వం నుంచి ఎక్కువ మొత్తంలో గౌరవ వేతనం వచ్చే అవకాశం లేదు. దాంతో పిల్లల తల్లిదండ్రులు, దాతలు 80 వేల రూపాయలు పోగు చేసి బడికి అందించారు. ఈ మొత్తం ద్వారా వచ్చే వడ్డీని - నెలకు మూడు వేల రూపాయల గౌరవ వేతనం ఇవ్వడానికి ముందుకొచ్చింది పాఠశాల విద్యాకమిటీ. వీటన్నిటికీ మండల విద్యాధికారి రఘోత్తమ్‌రెడ్డి పూర్తి సహకారం అందించారు.
ఆదర్శప్రాయం
అంతా సిద్ధమయ్యాక, మంచిరోజు చూసి బడిలో అక్షరాభ్యాస కార్యక్రమం చేపట్టారు. అ,ఆలతో పాటు ఏబీసీడీలు దిద్దించడం మొదలు పెట్టారు. తరగతిలో పాఠం చెప్పి వదిలెయ్యడం కాకుండా విద్యార్థులను బృందాలుగా విభజించి అందులోని విషయాలన్నిటినీ చర్చించే విధానాన్ని అమలులోకి తెచ్చారు. ఫలితంగా విద్యార్థులలో అవగాహన, సృజనాత్మకత పెరిగాయి. పాఠశాల ఆవరణలోని ఖాళీ స్థలంలో పండ్ల మొక్కలతో పాటు కూరగాయలు పెంచి మధ్యాహ్న భోజనంలో వినియోగించి విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తున్నారు. గత సంవత్సరం వరకు తెలుగు మీడియంలో చదివిన విద్యార్థులను ఈ మార్పులకు అనుగుణంగా సంసిద్ధం చేసేందుకు ప్రతి రోజు సాయంత్రం ఒక గంటసేపు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రతి ఆదివారం మధ్యాహ్నం 1 నుంచి 4 గంటల వరకు ఉచితంగా నవోదయ కోచింగ్ ఇస్తున్నారు. ఉపాధ్యాయులు పూనుకుంటే, ఊరు సాయమందిస్తే అన్ని ప్రభుత్వ పాఠశాలలూ ఇలా ముందడుగెయ్యడం ఎంతసేపు?
- ఏటి బాబు, చిన్నకోడూరు
- See more at: http://www.andhrajyothy.com/node/2739#sthash.6W4N69Ks.dpuf
'ప్రభుత్వ పాఠశాలలు వద్దు - ప్రైవేటు బడులే ముద్దు' అన్న ఆలోచనను మన బుర్రల్లోంచి తీసెయ్యగలమా? 'అందరూ తలోచెయ్యీ వేస్తే అదెంతసేపు?' అంటున్నారు మెదక్ జిల్లా మందపల్లి గ్రామస్థులు. కేవలం అని ఊరుకోలేదు, ఆచరణలోనూ చూపించారు. వాళ్లందరి కృషి వల్ల కిందటేడు 48మంది పిల్లలున్న బడి ఇప్పుడు 142మంది పిల్లలతో కళకళలాడుతోంది. మెదక్ జిల్లా చిన్నకోడూరు మండలంలోని మందపల్లి చిన్న ఊరు. అక్కడి ప్రాథమిక పాఠశాల అన్ని బడుల్లాగానే ఉండేది. కిందటేడు గట్టిగా యాభైమంది విద్యార్థులు కూడా లేరు. ఎక్కువమంది పిల్లలు దగ్గర్లోని సిద్ధిపేట ప్రైవేటు స్కూళ్లకు వెళ్లేవారు. ఈ విద్యాసంవత్సరం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిగా చేరిన మేఘమాలకు పరిస్థితి అర్థమయింది. తమ బడిని అన్ని హంగులతో తీర్చిదిద్దాలన్న పట్టుదల కనబరిచారామె. తోటి ఉపాధ్యాయులు వెంకట్‌రామ్‌రెడ్డి, పర్శరాములుగౌడ్ కూడా కలిసొచ్చారు. తల్లిదండ్రులు పిల్లలను ప్రైవేటు స్కూళ్లకు ఎందుకు పంపుతున్నారో ఆలోచించారు. అక్కడ విద్యుత్తు, ఫ్యాన్లు వంటి కనీస సౌకర్యాలుంటాయి, ఇంగ్లీషులో బోధన సాగుతుంది. ఇవి రెండూ ఉంటే బడి మెరుగవుతుందని ఆలోచించి ముందుగా ఒక ప్రణాళికను రూపొందించారు. ముందుగా సౌకర్యాల కోసం గ్రామ నాయకులను సంప్రదించారు ఉపాధ్యాయులు. పెద్దవాళ్లంతా పెద్దమనసు చేసుకున్నారు. జడ్పీటీసీ మాజీ సభ్యుడు దేవునూరి తిరుపతి 22 వేల రూపాయల ఖర్చుతో పాఠ్యపుస్తకాలు అందజేశారు. అల్లీపూర్‌కు చెందిన బండి ఆగయ్యగౌడ్ ఆరువేల విలువైన ఫ్యాన్‌లిచ్చారు. చేర్యాలకు చెందిన స్వచ్చంద సంస్థ మధ్యాహ్న భోజనం కోసం 200 ప్లేట్లు అందజేసింది. గ్రామ సర్పంచ్ అనసూయ పిల్లలకు టై, బెల్టులు పంపిణీ చేశారు. గ్రామంలోని జిందం కోమలశ్రీనివాస్, సిద్ధిపేటకు చెందిన పిల్లల వైద్యులు కె.శివరామచారి తదితరులు మైక్ సెట్, వాయిద్య పరికరాలు, క్రీడా సామాగ్రి మొదలైనవి ఇప్పించారు. అన్ని హంగులూ సమకూర్చుకున్నాక ఊళ్లోని పెద్దవాళ్లతో సమావేశమయ్యారు ఉపాధ్యాయులు. 'ప్రైవేటు చదువులంటే డబ్బు చాలా ఖర్చవుతుంది. రోజూ పైఊరికి వెళ్లి రావడమంటే మాటలు కాదు. ఈ వ్యయప్రయాసలు మీకెందుకు' అంటూ గ్రామస్థులకు నచ్చజెప్పారు. అందరూ సహకరిస్తే నాణ్యమైన విద్యను తామే అందిస్తామని హామీ ఇచ్చారు. తల్లిదండ్రులు అంగీకరించారు. ఉన్నత విద్యార్హతలున్న యువకులు విద్యావలంటీర్లుగా పనిచెయ్యడానికి ముందుకొచ్చారు. ఎమ్మెస్సీ బీఈడీ పూర్తి చేసిన డి.స్వామి, బీఎస్సీ బీఈడీ చదివిన డి.ప్రభాకర్, బిటెక్ అభ్యర్థి శ్యామ్, ఎంఎ తెలుగు చదువుకున్న బి.రాజులు వలంటీర్లుగా బడిలో చేరారు. వారికి ప్రభుత్వం నుంచి ఎక్కువ మొత్తంలో గౌరవ వేతనం వచ్చే అవకాశం లేదు. దాంతో పిల్లల తల్లిదండ్రులు, దాతలు 80 వేల రూపాయలు పోగు చేసి బడికి అందించారు. ఈ మొత్తం ద్వారా వచ్చే వడ్డీని - నెలకు మూడు వేల రూపాయల గౌరవ వేతనం ఇవ్వడానికి ముందుకొచ్చింది పాఠశాల విద్యాకమిటీ. వీటన్నిటికీ మండల విద్యాధికారి రఘోత్తమ్‌రెడ్డి పూర్తి సహకారం అందించారు. అంతా సిద్ధమయ్యాక, మంచిరోజు చూసి బడిలో అక్షరాభ్యాస కార్యక్రమం చేపట్టారు. అ,ఆలతో పాటు ఏబీసీడీలు దిద్దించడం మొదలు పెట్టారు. తరగతిలో పాఠం చెప్పి వదిలెయ్యడం కాకుండా విద్యార్థులను బృందాలుగా విభజించి అందులోని విషయాలన్నిటినీ చర్చించే విధానాన్ని అమలులోకి తెచ్చారు. ఫలితంగా విద్యార్థులలో అవగాహన, సృజనాత్మకత పెరిగాయి. పాఠశాల ఆవరణలోని ఖాళీ స్థలంలో పండ్ల మొక్కలతో పాటు కూరగాయలు పెంచి మధ్యాహ్న భోజనంలో వినియోగించి విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తున్నారు. గత సంవత్సరం వరకు తెలుగు మీడియంలో చదివిన విద్యార్థులను ఈ మార్పులకు అనుగుణంగా సంసిద్ధం చేసేందుకు ప్రతి రోజు సాయంత్రం ఒక గంటసేపు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రతి ఆదివారం మధ్యాహ్నం 1 నుంచి 4 గంటల వరకు ఉచితంగా నవోదయ కోచింగ్ ఇస్తున్నారు. ఉపాధ్యాయులు పూనుకుంటే, ఊరు సాయమందిస్తే అన్ని ప్రభుత్వ పాఠశాలలూ ఇలా ముందడుగెయ్యడం ఎంతసేపు?   - ఏటి బాబు, చిన్నకోడూరు
Courtesy-Andhrajyothy

నిలబడ్డం కాదు నిలబెట్టడమే ముఖ్యం

ఎవరో సాయం చేస్తే తప్ప ఎస్ఎస్ఎల్‌సి పరీక్ష ఫీజు కూడా కట్టలేని ఒకనాటి పేద విద్యార్థి, నేడు ఏటా 6500 మంది విద్యార్థినీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఇచ్చేస్థాయికి చేరుకున్నాడు. అతనే తులసీ రామచంద్ర ప్రభు. ఐఐటిలో తనకు రావలసిన ఉద్యోగం ఎప్పటికీ రాదని తెలుసుకుని నీరసించిపోకుండా, రుణసాయంతో చిన్న అట్టపెట్టెల (కరోగేటెడ్ బాక్సెస్) పరిశ్రమను మొదలెట్టి, 'కోస్టల్ ప్యాకేజింగ్' నుంచి 'తులసీ సీడ్స్' దాకా దాదాపు డజను కంపెనీలకు పైగా అధిపతి అయ్యారాయన. 67 ఏళ్ల జీవన ప్రస్థానంలో ఆయనకు ఎదురైన సంఘటనలే ఈ వారం 'అనుభవం'

పేదతనం వల్ల ఎదురయ్యే అవమానాలు, ఆటుపోట్లకు పెద్దవాళ్లయితే ఎలోగోలా తట్టుకుంటారు కానీ, అవి పసిబిడ్డలను భరించలేని బాధకు గురిచేస్తాయి. నేను పుట్టింది గుంటూరులోని జగ్గాపురం. పెరిగింది మాత్రం గుంటూరులోనే. మాది మొదట్లో సంపన్న కుటుంబమే అయినా, నాన్నగారి పొగాకు వ్యాపారంతో ఉన్న ఆస్తులన్నీ పోయి కుటుంబం అప్పుల పాలయ్యింది. నా హైస్కూలు రోజుల నాటికే కుటుంబ పరిస్థితి పుస్తకాలు, స్కూలు ఫీజు కట్టలేని స్థితికి చేరుకుంది. ఒక జత బట్టలకు మించి నాకు ఎప్పుడూ ఉండేవి కాదు. నా చిరిగిన దుస్తులకేసి జనం చూసే చూపులు చిత్రంగా ఉండేవి.

ఎస్ఎస్ఎల్‌సి పరీక్షకు కట్టాల్సిన 16 రూపాయల ఫీజుకే బంధువుల్ని ఆశ్రయించాల్సిన స్థితి మాది. ఇక కాలేజ్‌లో చేరేనాటికి స్కాలర్‌షిప్‌లు వస్తే తప్ప నాలాంటి వాడు చదువు కొనసాగించడం సాధ్యం కాదనే విషయం నాకు స్పష్టంగా తెలిసొచ్చింది. ఆ ఆలోచన నన్ను మరింత కష్టపడేలా చేసింది. ఐఐటి ప్రవేశ పరీక్షలో నాకు మంచి ర్యాంక్ రావడంతో నాకు మద్రాసు ఐఐటిలో సీట్ వచ్చింది. మెరిట్ స్కాలర్‌షిప్ కూడా వచ్చింది. ఫస్ట్ ర్యాంక్‌తో మెకానికల్ ఇంజినీరింగ్ పాసయ్యాను. నాకైతే ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించినంత ఆనందం వే సింది కానీ, ఆ తర్వాత జరిగిందంతా అనుకున్నదానికి పూర్తి విరుద్ధంగానే.''

అక్కడే ఆగిపోయి ఉంటే....
పట్టా చేతికి వచ్చీ రాగానే బిహెచ్ఇఎల్‌లో టెక్నికల్ మేనేజ్‌మెంట్ ట్రెయినీగా ఎంపిక య్యాను. వెంటనే వచ్చి చేరిపొమ్మన్నారు. వెళ్లే ముందు ఆనవాయితీగా జరిగే ఒక వైద్య పరీక్షకు పిలిచారు. అయితే, ఆ పరీక్షల్లో నాకు కలర్ బ్లైండ్‌నెస్ ఉందంటూ ఒక రిపోర్టు ఇచ్చారు. అప్పటిదాకా నాకు తెలియని ఒక దృష్టిలోపాన్ని వాళ్లు ఎత్తిచూపినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. కలర్ బ్లైండ్‌నెస్ అంటే ఇతరత్రా ఏ దృష్టిలోపమూ ఉండదు. ఆకుపచ్చ, ఎరుపు వర్ణాల మధ్య ఉండే తేడా తెలియదంతే. సామాన్య జీవనంలో ఇదేమీ పెద్ద సమస్య కాకపోవచ్చు కానీ, టెక్నికల్ మేనేజ్‌మెంట్‌లో ఈ లోపం చాలా ప్రమాదం అంటూ సెలక్షన్ లిస్ట్‌లోంచి నా పేరు తొలగించారు. నా కాళ్ల కింది భూమి కదిలిపోయింది. ఈ ఉద్యోగం పోతే పోయిందిలే అనుకుని మరో ఉద్యోగానికి వెళ్లినా అక్కడా ఇదే సమస్య కదా! అలాంటప్పుడు సొంతంగానే ఏమైనా చేసుకుంటే పోలా అనిపించింది.

ఒక సమగ్రమైన అధ్యయనం చేసి, కేవలం 4 లక్షల పెట్టుబడితో అట్టపెట్టెల ( కరోగేటెడ్ బాక్సెస్) పరిశ్రమ స్థాపించాను. బ్యాంకు రుణం పోగా అందులో నేను పెట్టింది 45 వేలే. అందులోనూ నా స్నేహితులూ, ఆత్మీయులు ఇచ్చిందే ఎక్కువ. ఏమైనా, 1977లో ప్రారంభమైన ఆ పరిశ్రమ విజయవంతం కావడంతో వెనక్కి తిరిగిచూసే అవసరం లేకుండా పోయింది. ఆ తరువాత 84లో ఒకటి, 2001లో మరొకటి మొత్తం మూడు పరిశ్రమల్ని గుంటూరులోనే నెలకొల్పాను. ప్రస్తుతం 450 కోట్ల టర్నోవర్‌తో ఈ పరిశ్రమలు నడుస్తున్నాయి.

ఆ తర్వాత కోస్టల్ ప్యాకేజింగ్, చంద్రాట్రాన్స్‌పోర్టు, తులసీ సీడ్స్ ఇలా పలు సంస్థల్ని ప్రారంభించాను. అవన్నీ కూడా విజయవంతంగానే నడుస్తున్నాయి. ఆ రోజే కనుక నేను ఆ ఉద్యోగంలో చేరిపోయి ఉంటే, నాకు అదే ప్రపంచమైపోయేది. జీవితం అక్కడే ముగిసిపోయేది, ఆ ఉద్యోగంలో ఎంత కష్టపడినా నేను ఈ స్థితికి వచ్చే వాడ్నే కాదు. వాస్తవానికి, ఇంతటి విశాల ప్రపంచంలో ఒక దారి మూసుకుపోయినంత మాత్రాన ప్రపంచమే చేజారిపోయినట్లు విషాదంలో కూరుకుపోవలసిన అవసరం లేదు. కళ్లు తెరిచి చూస్తే ఎదురుగా వేల మార్గాలు కనిపిస్తాయి. ఇదీ ఆ సంఘటన ఫలితంగా నేను గ్రహించిన అనుభవం.

అలా మొదలయ్యింది
19 ఏళ్ల క్రితం ఒక రోజు నేను గుంటూరులోని నా కార్యాలయంలో ఉన్న సమయంలో ఎవరో ఒక స్టూడెంట్ నా కోసం వచ్చాడని ఆఫీస్ బాయ్ చెప్పాడు. వేచి ఉండమని చెప్పి మళ్లీ పనిలో నిమగ్నమైపోయాను. పని ముగించుకునేసరికి రాత్రి అయ్యింది. ఇంటికి వెళ్లిపోవడానికి సిద్ధమవుతున్న సమయంలో ఒక కుర్రాడు బయట కనిపించాడు. ఉదయం నుంచి నాకోసం ఎదురుచూస్తున్న విద్యార్థి అతడేనని తెలుసుకుని, వెంటనే ఛాంబర్‌లోకి పిలిపించాను. ఇంజనీరింగ్‌లో సీటు వచ్చినా డబ్బుల్లేక బి. ఎస్‌సిలో చేరిన ఆ కుర్రాడి గా«థ విని డిడి తీసి ఇంజనీరింగ్‌లో చేర్పించాను. దానితో మొదలైన ఆలోచన ప్రతిభ ఉండీ చదువుకోలేకపోయిన వాళ్లకు సహకరించేందుకు 'శ్రీకృష్ణ దేవరాయ ఎయిడ్ ఫర్ పూర్ అండర్ ప్రివిలెజ్డ్' అన్న పేరుతో ఒక సంస్థకు శ్రీకారం చుట్టేలా చేసింది. ఓ పదేళ్ల క్రితం కాలేజ్ అడ్మిషన్స్ జరుగుతున్న రోజుల్లో జరిగిన ఓ సంఘటన నన్ను విపరీతంగా కదిలించివేసింది. వేరే చోట 90 మంది విద్యార్థులను ఇంటర్వ్యూ చేసి ఇంటికి వచ్చేసరికి రాత్రి 8.30 అయ్యింది.

ఇంజనీరింగ్‌లో సీటు వచ్చినా, అడ్మిషన్ ఫీజు కట్టలేని స్థితిలో ఓ 55 ఏళ్ల పెద్దమనిసి తన కొడుకును వెంటబెట్టుకుని మా ఇంటికి వచ్చాడు. "వాళ్లను చూడగానే ఎప్పుడు వచ్చారు? ఎక్కడి నుంచి?'' అన్నాను " రేపల్లెనుంచి పొద్దున 8.30 కు వచ్చామయ్యా''అన్నారు. "ఎప్పుడు బయల్దేరారు?''అంటే "ఉదయం 3.30కు అయ్యా'' అన్నారు. 'నేను ఇచ్చే 5వేల రూపాయల కోసం ఉదయం 3.30కు బయల్దేరి వచ్చి రాత్రి 8.30 దాకా వేచిచూస్తున్నారా? నేనో మహాదాతలా ఇన్ని గంటలు వెయిట్ చేయించానా?' నాలో ఏదో తెలియని బాధ. ఒక అపరాధ భావన. "మీకు నా మీద కోపం రావడం లేదా?'' అన్నాను. ఊహించని నా ప్రశ్నకు ఆ పెద్దాయన ఉలిక్కిపడ్డట్లు చూశాడు. కొద్ది క్షణాల్లో అతని కళ్లల్లో నీళ్లు తిరగడం మొదలెట్టాయి. " మీ మీద నాకు కోపమా అయ్యా! నేనెవరో మీకు తెలియదు.

అయినా నా కొడుకు చదువు కోసం మీరు 5 వేలు ఇస్తున్నారు. మీ మీద నాకు కోపం ఏమిటి సామీ! కోపం కాదుగానీ, భయమేసిందయ్యా! '' అన్నాడు. ఎందుకూ అంటే "ఇంత రాత్రయింది కదా ! రేపు రమ్మంటారేమోనని భయమేసిందయ్యా! ఎందుకంటే రేపు మళ్లీ రావ డానికి నా దగ్గర డబ్బుల్లేవయ్యా!'' అన్నాడు. ఇంక నేను నిగ్రహించుకోలేకపోయాను, నా కళ్లల్లోంచి బొటబొటా నీళ్లొచ్చేశాయి. పిల్లాడి చదువు మీద ఎంత శ్రద్ధ లేకపోతే ఇక్కడ ఇన్ని గంటలు నిరీక్షిస్తాడు? సమయానికి ఒక సహాయం అందకపోతే ఎంతో ఉజ్వలంగా వెలగాల్సిన జీవితాలు ఎలా కొడిగట్టుకుపోతాయో కదా అనిపించింది. ఈ పనికి ఎవరో కొద్దిమంది చేయూత ఇచ్చినంత మాత్రాన సరిపోదు. ఆర్థికంగా ఎంతో కొంత నిలదొక్కుకున్న ప్రతి ఒక్కరూ తమ శ క్తి మేరకైనా ఆదుకోకపోతే బంగారం లాంటి పిల్లల మనుగడ మట్టిపాలవుతుందని నేను నిత్యం అనుకుంటాను.

మనుషుల్ని చేయడం ముఖ్యం
నేను ప్రారంభించిన ప్రతి ప్రాజెక్టూ సక్సెస్ అయ్యింది. వ్యక్తిగతంగా నేను విజేతనే. కానీ, ఒక వ్యక్తి విజయం దేశ విజయం కాదు కదా! వ్యక్తిగత విజయం సంతోషదాయకమే కావచ్చు గాక సామాజిక దృష్టితో చూస్తే నిత్యం ఆందోళన పడుతున్న మనిషిన్నేను. కొంతమందికి స్కాలర్‌షిప్‌లు ఇవ్వడం ద్వారా నేనేదో మహాయజ్ఞం చేశానని అనుకోవడం లేదు. జరుగుతున్న విపరిణామాల్ని చూసి లోలోపల ఎంతో ఆవేదనకు గురవుతుంటాను. ఆర్థిక పురోగతి సాధిస్తున్నామని చెప్పుకునే మనం భావితరాల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాం? మన పిల్లలకు, స్త్రీలకు ఏమైనా భవిష్యత్తూ, భద్రతా ఉన్నాయా? మన బిడ్డలు రేపు ఎక్కడ అత్యాచారాలకు గురవుతారో, ఎక్కడ గొంతు పిసికేయబడతారో, ఎప్పుడు రక్తపు ముద్దలై మన కళ్లముందు కుప్పపడతారో ఏమీ తెలియకుండా పోతోంది. మన అతి పెద్ద బా«ధ్యత వీటిని నివారించడంలోనే ఉందని నాకు తరుచూ అనిపిస్తూ ఉంటుంది.

పొట్ట పోసుకోవడం కోసం ఎవరూ అంత క ష్టపడక్కర్లేదు. ఏ చిన్న పనితోనైనా బతికేయొచ్చు. నిజంగానే ఏమైనా చేయాల్సి ఉంటే అది దేశం కోసమే. ఎవరికి వాళ్లు డబ్బుల లెక్కల్లోనే సతమతమైపోతున్నారు. ఒక్కోసారి నాకే లెక్కలు సరిగా రాక వెనకబడిపోతున్నానేమో ? అని కూడా అనిపిస్తూ ఉంటుంది. కానీ, డబ్బే సమస్తం అనుకోవడం వల్లే కదా మనిషి మనిషి కాకుండాపోతున్నాడు. ఏదో సాయం అందించి శరీరాల్ని నిలబెట్టడం చేయవచ్చు. కానీ, అంతకన్నా ముఖ్యంగా మనిషిని నిలబెట్టాలి. మనీషిగా నిలబెట్టాలి. ఈ విషయంలో ఎవరెంత ఎక్కువ చేసినా అది తక్కువేనని నాకనిపిస్తుంది.

బమ్మెర ,
గింజుపల్లి భాస్కరరావు-గుంటూరు
Courtesy-Andhrajyothy

వసతి గృహాల్లో 'మనో పాఠాలు'

పిల్లలు అల్లరి చేస్తేనో, చదువుకోకుండా మారాం చేస్తేనో.. బుజ్జగించో, కాస్త భయపెట్టో.. సన్మార్గంలో నడిపించే ప్రయత్నం చేస్తారు తల్లిదండ్రులు. కాని ఇంటికి దూరంగా హాస్టళ్లలో ఉండే పిల్లలకు అలాంటి సమస్యలు వస్తే ఎవరు దిక్కు? వయసుతోపాటు వచ్చే మానసిక సమస్యల్ని ఎవరు తొలగిస్తారు? అలాంటి వారికి నేనున్నాను అంటున్నారు ఖమ్మం పట్టణానికి చెందిన సైకాలజిస్ట్ తాళ్లూరి లక్ష్మి. ఎస్సీ, ఎస్టీ వసతిగృహాలకు వెళ్లి ఉచిత మానసిక వైద్యం అందిస్తున్న ఆమె గురించే ఈ కథనం...

అది ఖమ్మంలోని అంబేద్కర్‌భవన్. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ సంక్షేమ వసతిగృహాల నుంచి వచ్చిన విద్యార్థులతో హాలు నిండిపోయింది. సైకాలజీ కౌన్సిలర్ లక్ష్మి చెబుతున్న మానసిక పాఠాలను ఆసక్తిగా వింటున్నారంతా. తరగతిగదిలో విన్న పాఠ్యాంశాలు జ్ఞానాన్ని ఇస్తే, లక్ష్మి పాఠాలు మానసిక వికాసాన్ని కలిగిస్తున్నాయి.

బడుగు విద్యార్థులకు ప్రభుత్వం ఉచిత విద్య, వసతి కల్పిస్తున్నదే కానీ, వారి మానసిక ఎదుగుదలకు చొరవ చూపడం లేదు. ఆ లోటును పూడ్చాలనుకున్నారు తాళ్లూరి లక్ష్మి. గుంటూరులోని నాగార్జున విశ్వవిద్యాలయంలో ఎంఏ మానసికశాస్త్రం, ఫ్యామిలీ అండ్ మ్యారేజ్ కౌన్సెలింగ్‌లో ఎంఫిల్ చేశారామె. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ కూడా చేస్తున్నారు. ఇంత చదువు చదివి ఇంట్లో ఖాళీగా ఉండటం దేనికని.. అవసరమైన చోట తన సేవల్ని అందించేందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్నారు.

మనోబలం అవసరం..
"మన దేశంలో మానసిక వైద్యుల ప్రాధాన్యం ఇప్పుడిప్పుడే పెరుగుతోంది కాని అభివృద్ధి చెందిన దేశాల్లో వాళ్లకు చాలా ప్రాధాన్యమే ఉంది. చిన్నపిల్లల్లో నడవడిక, ప్రవర్తనకు సంబంధించి ఏ లోపాలు తలెత్తినా ఆ దేశాల్లో మానసిక వైద్యం తీసుకుంటారు. మన దేశంలో కూడా ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాలలో చదివే పిల్లలకు ఇలాంటి మానసిక వైద్యం అందించడం అవసరం'' అంటున్నారు లక్ష్మి. ప్రభుత్వ విద్యాలయాల్లో చదివే విద్యార్థుల్లో అపోహలు, భయాలు, ఆత్మన్యూనతా భావాలను పోగొడితే.. వారు అద్భుతఫలితాలు సాధిస్తారన్నది ఆమె నమ్మకం.

గత నాలుగేళ్ల నుంచి ఆమె ఇదే పనిలో బిజీగా ఉన్నారు. ఖమ్మం జిల్లాతోపాటు, విజయవాడ, గుంటూరులలోని నిరుపేద విద్యార్థులకు ఉచిత మానసిక వైద్యం అందిస్తున్నారు. "సాంఘికసంక్షేమ వసతిగృహాల పరిస్థితి దయనీయం. తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ చదువుకునే విద్యార్థులకు నైతిక ప్రోత్సాహం ఇవ్వాలి. వారికి వారు ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకోలేరు. శరీరానికి తిండి ఎలాగో, మనసుకు శక్తి కూడా అలా అవసరం. ఆ శక్తిని ఇస్తుంది సైకాలజీ కౌన్సెలింగ్. వెనుకబడిన విద్యార్థులు పలు మానసిక ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి వారిలో సానుకూల దృక్పథాన్ని (పాజిటివ్ థింకింగ్) ప్రోత్సహిస్తే.. మంచి ఫలితం వస్తుంది. మేమిప్పుడు అదే పని చేస్తున్నాం'' అన్నారామె.

థెరపీలతో చురుగ్గా..
"ఎస్సీ, ఎస్టీ హాస్టళ్ల పిల్లలను ఎంచుకోవడానికి కారణం ఉంది. వారికి ప్రభుత్వం రోజుకు అయిదురూపాయలే ఇస్తుంది. అందులోనే టిఫిను, భోజనం అన్నీ జరిగిపోవాలి. బయట ఖర్చు పెట్టేందుకు చేతిలో చిల్లిగవ్వ ఉండదు. తల్లిదండ్రులు నిరుపేదలు కావడంతో పిల్లల్ని హాస్టళ్లలో వదిలిపెట్టేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లల్ని బోలెడన్ని మానసిక సమస్యలు చుట్టుముడతాయి. జ్ఞాపకశక్తి లోపిస్తుంది. దానివల్ల లాంగ్వేజ్ బేసిక్స్ అలవడవు'' బాధపడుతూ చెప్పారు లక్ష్మి. వసతిగృహాల విద్యార్థులకొచ్చే మరొక సమస్య.. మాధ్యమం మారడం. కొన్ని క్లాసులకు వచ్చాక కొందరు విద్యార్థులు తెలుగు మీడియం నుంచి ఇంగ్లీషు మీడియానికి మారాల్సి వస్తుంది. ఆంగ్లభాష మీద ఉండే భయాల వల్ల వార్షిక పరీక్షలప్పుడు ఫోబియో పట్టుకుంటుంది. వాటిని తొలగించేందుకు 'ఒకే రోజు రెండు ఉదయాలు' అన్న 'డాన్ థియరీ' టెక్నిక్‌ను విద్యార్థుల మీద ప్రయోగిస్తున్నారు లక్ష్మి. "ఒక రోజును 12గంటల చొప్పున రెండు భాగాలుగా విడగొట్టి ఆ సమయంలో విద్యార్థులకు రీడింగ్ అవర్స్‌ను పెడుతున్నాము. ఇది సత్ఫలితాలను ఇస్తోంది. దీంతో పాటు 'మనకు ఒక లక్ష్యం కావాలి' అన్న భావనను విద్యార్థుల్లో నూరిపోసేందుకు 'న్యూరోలింగ్విస్టిక్ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెడుతున్నాను. దీనివల్ల ప్రతి విద్యార్థి మనసులో ఒక ఊహాచిత్రం (లక్ష్యం) ఏర్పడుతుంది. పిల్లలు దాన్ని సులువుగా గుర్తుపెట్టుకుంటారు. అది చదువును బలోపేతం చేస్తుంది'' అంటూ వివరించారామె.

ఖమ్మం జిల్లా వైరా పట్టణంలోని 'బాలవెలుగు' పిల్లలకు కూడా కౌన్సెలింగ్ ఇస్తున్నారు లక్ష్మి. "ఇక్కడున్న పిల్లలంతా సింగిల్‌పేరెంట్ ఉన్నవాళ్లే. తల్లి లేదా తండ్రి ఒక్కరే ఉన్నవారు కాబట్టి.. ఇలాంటి పిల్లల్లో కొన్ని మానసిక సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. బిహేవియర్ థెరపీ, సైకోథెరపీ ద్వారా వాటిని తొలగిస్తున్నాను. పిల్లల్లో కౌమారదశ నుంచి యవ్వనదశకు వచ్చే సమయంలో హార్మోన్ల సమతుల్యత లోపిస్తుంది. ఆ మార్పువల్ల ప్రవర్తనలో తేడాలొస్తాయి. ఇవన్నీ చదువును ప్రభావితం చేస్తుంటాయి. ఇక్కడే సైకాలజిస్టులు అవసరం అవుతారు. లోకజ్ఞానం తక్కువగా ఉండి, ఆత్మవిశ్వాసం లేని వాళ్లకు కూడా జాకబ్‌సన్ థియరీ, ఫెగ్గింగ్ మెథడ్‌లతో కాన్ఫిడెన్స్ లెవెల్స్‌ను పెంచుతున్నాము'' అన్నారు లక్ష్మి.
- వల్లభనేని రమేష్‌బాబు,
ఫోటోలు : మహేష్, ఖమ్మం

ప్రభుత్వం రోజుకు అయిదురూపాయలే ఇస్తుంది. అందులోనే టిఫిను, భోజనం అన్నీ జరిగిపోవాలి. బయట ఖర్చు పెట్టేందుకు చేతిలో చిల్లిగవ్వ ఉండదు. తల్లిదండ్రులు నిరుపేదలు కావడంతో పిల్లల్ని హాస్టళ్లలో వదిలిపెట్టేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లల్ని బోలెడన్ని మానసిక సమస్యలు చుట్టుముడతాయి.
Courtesy-Andhrajyothy

ఉద్యోగాలిచ్చి గ్రామం రుణం తీర్చుకున్నా...

మహబూబ్‌నగర్ జిల్లాలో దూరంగా విసిరేసినట్టుండే ఓ కుగ్రామం కుడికిళ్ల. నల్లమల సరిహద్దులలో ఉన్న ఈ గ్రామ ప్రజలు బస్సు ఎక్కాలంటే మూడు కిలోమీటర్లు నడిచి వెళ్లాలి. అలాంటి కుగ్రామం నుంచి ఒక కుర్రాడు హైదరాబాద్ వచ్చాడు. నగరాన్ని అర్థం చేసుకున్నాడు. క్రమక్రమంగా ఎదిగాడు. కాని తన మూలాలను మర్చిపోలేదు. గ్రామానికి అవసరమైనవన్నీ చేస్తూనే ఉన్నాడు. తొలిసారి హైదరాబాద్ వచ్చినప్పుడు కోఠిలో గుర్రపు బళ్లను చూసి ఎప్పటికైనా అలాంటి దాంట్లో ప్రయాణిస్తే బావుంటుందనుకున్న ఆ కుర్రాడే ఇప్పుడు 'మై హోం గ్రూపు'కు ఛైర్మన్ అయ్యాడు. ఆరువేల కోట్ల రూపాయల గ్రూపుకు అధిపతి అయినా- తన ఊరి మట్టి వాసన ఎప్పటికీ మర్చిపోను అంటున్న డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు జ్ఞాపకాలే ఈ వారం 'మా ఊరు'.

"మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని చిట్టచివర గ్రామం మాది. పేరు కుడికిళ్ల. మా గ్రామం దాటితే మూక్కుడుగుండ్ల అనే ఆవాసం ఉండేది. ఆ తర్వాతంతా నల్లమల అడవే. బహుశా అడవి పక్కనే ఉండటం వల్ల అనుకుంటా..మాకు వానలు బాగా పడేవి. మహబూబ్‌నగర్‌జిల్లాలో వానలు బాగా పడటం ఏమిటి? అది వర్షాభావం ఉన్న జిల్లా కదా అని మీలో కొందరు ఆశ్చర్యపోవచ్చు. 1960లలో వాతావరణ పరిస్థితులు వేరేగా ఉండేవి. అందువల్ల ఇప్పుడున్నంత వర్షాభావం అప్పుడుండేది కాదు. ప్రతి సీజన్‌లోను రక రకాల పళ్లు దొరికేవి. వానాకాలం వచ్చి వెళ్లిన తర్వాత సీతాఫలాలు చిన్నసైజు కొబ్బరి బొండాల సైజులో వచ్చేవి.

వాటిని కాల్చుకుతినడం ఇంకా గుర్తే. మా ఊర్లో కులాలు, మతాలు పెద్దగా పట్టించుకొనేవారు కాదు. హిందూ పండగలను ముస్లింలు చేసుకొనేవారు. అలాగే పీర్ల పండగలో హిందువులూ పాల్గొనేవారు. ఊరంతా ఒక కట్టుబాటుతో ఉండేవారు. ఉదాహరణకు మా ఊర్లో కల్లు దుకాణం ఎక్కడో దూరంగా ఉండేది. తాగినవాళ్లు ఊళ్లోకి వచ్చి గొడవలు చేయడంలాంటివేమీ ఉండేవి కావు. వచ్చినా ఇంటికి వెళ్లి మౌనంగా పడుకొనేవారు. బహిరంగంగా తాగే అలవాటు ఉండేది కాదు. ఇప్పుడు ఆ సంస్కృతి పోయింది. ఈ మధ్య ఊరు వెళ్లినప్పుడు అక్కడ పనిచేసే కొందరు మహిళలు తమకు చుక్కేసుకుందుకు డబ్బులు కావాలని అడిగారు. ఎంత మార్పు వచ్చిందా? అనిపించింది..

నాన్న- విమానం
మా నాన్న పేరు వెంకటయ్య. మాకు 30 ఎకరాల దాకా పొలం ఉండేది. నాకు ఏడేళ్ల వయస్సు ఉన్నప్పుడు మా నాన్న చనిపోయాడు. ఊర్లో వాళ్లందరూ నా మీద తండ్రి లేని పిల్లాడని సానుభూతి చూపిస్తూ ఉండేవారు. నాన్న చిన్నప్పుడే చనిపోయినా- రెండు సంఘటనలు మాత్రం నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. నా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దిన సంఘటనలవి. మా నాన్న చాలా నిజాయితీపరుడు. ఎవరికి అవసరం వచ్చినా ఆదుకొనేవాడు. అందువల్ల అందరూ ఆయనను చాలా గౌరవంగా చూసేవారు. ఆయనలో ఒక మంచి గుణమేమిటంటే- ఎంత కోపం వచ్చినా తమాయించుకొనేవాడు. ఎవరినీ పల్లెత్తు మాట అనేవాడు కాదు. సాయంత్రాలు మా ఇంట్లో ఉన్న జీతగాళ్లను కూర్చోబెట్టి కబుర్లు చెప్పటం నాకు ఇంకా గుర్తే. అప్పుడప్పుడు నేను కూడా మా నాన్న దగ్గర కూర్చునేవాడిని. కొన్ని సార్లు ఆకాశంలో విమానాలు కనిపిస్తూ ఉండేవి. మా నాన్నతో సహా ఎవరికీ ఆ విమానం దగ్గరగా చూస్తే ఎలా ఉంటుందో తెలియదు.

కానీ జీతగాళ్లందరికీ- 'మావాడు పెద్దయితే అలాంటి విమానాల్లో తిరుగుతాడు..అప్పుడు మనం ఇక్కడి నుంచి చూడాలి' అని చెప్పేవాడు. ఆ మాటలు నాలో బలంగా నాటుకుపోయాయి. ఏదో సాధించాలనే కోరికకు బీజం పడింది అప్పుడేనేమో! మరొక సంఘటన కూడా చెప్పాలి. ఒక రోజు మా నాన్న రూపాయి నోటును గూట్లో పెట్టి మర్చిపోయాడు. ఆ రోజుల్లో రూపాయికి చాలా విలువ ఉండేది. ఐదు పైసలు పెడితే జేబు నిండా పుట్నాల పప్పు వచ్చేది. పది పైసలికి చాక్లెట్లు వచ్చేవి. నా కన్ను మా నాన్న పెట్టిన రూపాయి మీద పడింది. వెంటనే దాన్ని తీసేస్తే నాన్నకు తెలుస్తుందని.. నాలుగైదు రోజులు ఆ రూపాయిని అటూ ఇటూ జరిపా. నాన్న ఆ నోటు గురించి మర్చిపోయాడనుకున్నాక ఒక రోజు ఆ నోటు తీసుకువెళ్లి ఖర్చు పెట్టేసా.

ఆ మర్నాడు మా నాన్నకు గుర్తొచ్చింది. ఎవరు తీసారని అడిగాడు. అమ్మ తీయలేదంది. నేను కూడా ఏ మాత్రం బెదరకుండా నేను తీయలేదని చెప్పా. అప్పటికి మా తమ్ముడు జగపతిరావుకు ఏడాదనుకుంటా. వాడు తీయలేడు కాబట్టి నేనే తీసి ఉంటానని నాన్నకు అర్థమై ఎందుకు దొంగతనం చేశావని కొట్టడం మొదలుపెట్టాడు. నేను వీధిలోకి పారిపోయా. నాన్న కోపం తట్టుకోలేక నా వెంట పడ్డాడు. మా ఇద్దరి గొడవను మొత్తం ఊరంతా విస్తుపోయి చూసింది. నాన్న నన్ను పట్టుకొని చాలా గట్టిగా కొట్టాడు. ఆ తర్వాత కొట్టినందుకు చాలా బాధపడ్డాడనుకోండి. అయితే నన్ను ఎప్పుడూ ఎంతో ప్రేమతో చూసే నాన్నకు అంత కోపం ఎందుకు తెప్పించానా అనే ప్రశ్న నాలో తలెత్తింది. జీవితంలో క్రమశిక్షణకు, నిజాయితీకి ఉన్న విలువేమిటో అర్థమయింది.

కంఫర్ట్ జోన్
మా నాన్న చనిపోయేనాటికి మా అన్నయ్య బీఎస్సీ చదువుతున్నాడు. నాకు, ఆయనకు 12 ఏళ్ల తేడా. మా తమ్ముడు నాకన్నా ఐదేళ్లు చిన్న. దీంతో కుటుంబాన్ని నడపాల్సిన బాధ్యత మా అన్నయ్యపై పడింది. మా నాన్నకు జబ్బుగా ఉందని తెలిసి- మా అన్నయ్యకు త్వరగా పెళ్లి చేసేశారు. ఇంట్లో పనంతా అమ్మ, వదినా చూసుకొనేవారు. అన్నయ్య వ్యవసాయ పనులు చూసుకొనేవాడు. నేను ఇంటర్ పూర్తయిన వెంటనే బీఎస్సీలో చేరా. 'బీఎస్సీ చదివి బీఈడీ చేస్తే టీచరు ఉద్యోగం వస్తుంది, మా గ్రామంలో కాని సమీపంలో కాని టీచరు ఉద్యోగం చేసుకుంటూ వ్యవసాయం చూసుకుంటూ బతికేయొచ్చ'నేది, మా అన్నయ్యతో సహా మా ఊర్లో చాలామంది నా గురించి చేసిన ఆలోచన. నా గురించే కాదు, గ్రామంలో అందరు కుర్రాళ్ల గురించి వాళ్ల పెద్దవాళ్లు ఆ విధంగానే ఆలోచించేవారు.

ఊర్లోనే చదువు. చదువు అయిపోయిన వెంటనే అక్కడే ఉద్యోగం. చదువు రాకపోతే వ్యవసాయం. అంతకన్నా పెద్ద కోరికలు ఉండేవి కాదు. బహుశా వారికి ఇదొక కంఫర్ట్ జోన్ అనుకుంటా. దీని నుంచి బయటకు రావటానికి వారు ఇష్టపడరు. వారిని బయటకు తీసుకువచ్చేవారు కూడా ఎవరూ ఉండరు. బయట ప్రపంచం ఎలా ఉంటుందో, దానిలో ఎన్ని అవకాశాలు ఉన్నాయో చెప్పేవారు లేకపోవటం కూడా ఒకప్పటి గ్రామాల్లో ప్రధానమైన సమస్య. అయితే చాలామందిలా నేను ఊర్లోనే ఉండిపోవాలనుకోలేదు. బాగా చదువుకోవాలని, ఏదో చేయాలని ఉండేది. కానీ ఏం చేయాలో తెలియదు. బయటకు వెళ్లాలని.. ప్రపంచాన్ని చూడాలని.. అందరూ మనని గుర్తించేలా ఏదో సాధించాలని అనిపించేది. కానీ ఏం చేయాలో తెలిసేది కాదు. ఇలాంటి సందిగ్దావస్థలోనే మహబూబ్‌నగర్‌లో బీఎస్సీలో చేరా. ఆ సమయంలోనే హైదరాబాద్‌లో హోమియో కాలేజీలో అడ్మిషన్ల కోసం ప్రకటన పడింది.

రింజిం రింజిం హైదరాబాద్..
బీఎస్సీ చదివితే టీచరు ఉద్యోగం వస్తుందనేది అన్నయ్య ఉద్దేశం. కానీ నాకు ఇష్టం లేదు. దాంతో ఎవరికీ చెప్పకుండా హోమియో కాలేజీలో అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసా. సీటు వచ్చింది. ఇంట్లో చెబితే వద్దంటారని చెప్పకుండా ఫీజు కట్టేసా. ఆ తర్వాత ఇంటికి వచ్చి అమ్మకు, అన్నయ్యకు చెప్పా. ఆ సమయంలో హోమియోపతికి ఇప్పుడున్నంత ప్రచారం లేదు. అసలు హోమియోపతి అంటేనే చాలా మందికి తెలియదు. అలాంటి చదువు చదివి ఏం చేస్తావనేది అన్నయ్య ప్రశ్న. అనేక వాద ప్రతివాదాలయ్యాక అన్నయ్యను ఒప్పించగలిగా. కానీ నేను హైదరాబాద్‌కు వెళ్తానంటే అమ్మ చాలా భయపడింది. ఎందుకంటే అప్పటి దాకా మా ఊరినుంచి ఎవరూ హైదరాబాద్ వెళ్లి చదువుకోలేదు. చదువుకోవటం దాకా ఎందుకు.. అసలు హైదరాబాద్ వెళ్లినవాళ్లే తక్కువ. అలాంటి సాహసం నేను చేయటం అమ్మకు ఇష్టం లేదు. కానీ ఆమెను కూడా అతికష్టం మీద ఒప్పించా. అలా 1979లో హైదరాబాద్‌కు తొలిసారి వచ్చిన నాకు అదొక పూర్తి కొత్త ప్రపంచంలా కనిపించింది.

గౌలిగూడ బస్‌స్టాండ్‌లో దిగి స్నేహితుడి దగ్గరకు రిక్షాలో వెళ్తుంటే వింత ప్రపంచాన్ని చూస్తున్న భావన కలిగింది. దీంతో కాలేజీలో చేరిన వెంటనే సైకిల్‌ను అద్దెకు తీసుకుని మొత్తం హైదరాబాద్ అంతా తిరుగుతూ ఉండేవాడిని. డిగ్రీ మూడో ఏడాదిలో నేనే ఒక హెర్క్యులిస్ సైకిల్ కొనుక్కున్నా. ఆ సైకిల్‌ను చాలా భద్రంగా చూసుకొనేవాడిని. నా రూమ్ రెండో ఫ్లోర్‌లో ఉండేది. కిందపెడితే ఎవరైనా పట్టుకుపోతారని ప్రతి రోజు రాత్రి దాన్ని రెండు ఫోర్లు పైకి పట్టుకెళ్లేవాడిని. నడక మాత్రమే తెలిసినవాడికి ప్రపంచాన్ని వేగంగా చూడటం సైకిల్ నేర్పుతుంది. ఆ తర్వాత ఎన్ని కార్లు కొన్నా, విమానాలలో తిరిగినా- సైకిల్ మీద తిరిగిన అనుభూతి రాలేదు. ఇది కార్లలో పుట్టి పెరిగిన వాళ్లకు తెలియదు. నేను మా కాలేజీ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్‌గా ఉండేవాడిని.

ఎంబీబీఎస్ విద్యార్థులతో సమానంగా మమ్మల్ని చూడాలంటూ సమ్మె చేశాం. చాలాసార్లు మమ్మల్ని అరెస్టు చేశారు. పగలు కస్టడీలో ఉంచుకుని రాత్రి సనత్‌నగర్ దగ్గర వదిలేసేవారు. అప్పుడు హైదరాబాద్‌లో ఎక్కువ బస్సులు తిరిగేవి కావు. అక్కడి నుంచి మసాబ్‌ట్యాంక్ దాకా నడుచుకుంటూ వచ్చేవాళ్లం! ఆ సమయంలో హయగ్రీవాచారి వైద్యశాఖ మంత్రిగా ఉండేవారు. చెన్నారెడ్డి ముఖ్యమంత్రి. వీరిద్దరితోను పోరాడి మేం డిమాండ్‌లు సాధించుకోగలిగాం. కాలేజీకి సెలవులు ఇచ్చినప్పుడల్లా ఊరుకి వెళ్లిపోయేవాడిని. ఊర్లో వాళ్లకు వైద్యం చేసేవాడిని. మా గ్రామం నుంచి హైదరాబాద్‌కు వెళ్లి చదువుకుంటున్నది నేనొక్కడినే కాబట్టి ఊర్లో వాళ్లు నన్ను భలే గౌరవంగా చూసేవారు.

ఎదిగే సమయం..
1982లో దిల్‌షుక్‌నగర్‌లో హోమియోడాక్టర్‌గా ప్రాక్టీసు ప్రారంభించా. తమ్ముడు జగపతిరావు కూడా నాతో పాటు హైదరాబాద్ వచ్చేసాడు. ఆ సమయంలో ఆ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ రేట్లు చాలా తక్కువగా ఉండేవి. భూములు కొనేవాళ్లు ఎక్కువ మంది ఉండేవారు కాదు. ఏ విషయాన్నైనా కూలంకషంగా తెలుసుకోవటమనేది నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. నా దృష్టి రియల్ ఎస్టేట్ వ్యాపారంపై పడింది. కానీ వ్యాపారం చేయటానికి నా దగ్గర పెట్టుబడి లేదు. మా మామయ్యను 50 వేల రూపాయలు అప్పు అడిగా. ఆయన దగ్గర కూడా అంత సొమ్ము లేదు. అయినా మా అమ్మ వెళ్లి అడిగేసరికి ఆయన కాదనలేకపోయాడు. మొత్తం వాళ్లింట్లో ఉన్న బంగారమంతా ఇచ్చేసాడు. దాన్ని అమ్మి వ్యాపారం మొదలుపెట్టా. ఈ విషయం గుర్తుకువచ్చినప్పుడల్లా ఆయనకు నేను ఎంత రుణపడి ఉన్నానా అనిపిస్తుంది.

ఆయనకే కాదు. మా అత్తయ్యకు కూడా. ఇంట్లో బంగారమంతా ఇచ్చేయటానికి ఏ ఇల్లాలు ఒప్పుకుంటుంది? మా అత్తయ్య మాత్రం ఏ మాత్రం వెనకాడకుండా ఇచ్చేసింది. ఒక వైపు ప్రాక్టీసు చేస్తూనే మరో వైపు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడిని. ఆ సమయంలో భూమి దగ్గరకు వెళ్లి ఎవరూ చూసేవారు కాదు. లేఅవుట్‌ను కాగితాల మీదే చూపించేవారు. రిజిస్ట్రేషన్లు అయిపోయేవి. అయితే కొందరు మోసం కూడా చేసేవారు. మా కస్టమర్లకు మాపై నమ్మకమే మాకు శ్రీరామరక్షగా మారింది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌తో పాటు మా గ్రూపు కూడా ఎదిగింది. తమ్ముడు, సిబ్బంది కూడా నాతో పాటుగా శ్రమించారు. మేం కొత్త వ్యాపారాలలో ప్రవేశించి విజయం సాధించాం. ఈ విజయాల వెనక మా ఊరు నేర్పిన పాఠాలున్నాయి. తీర్చిదిద్దిన వ్యక్తిత్వముంది. అదే నన్ను ఈ నాటికీ ముందుకు నడిపిస్తోంది!

మా ఊరి కోసం..
చాలామంది ఊరును అభివృద్ధి చేయటమంటే విరాళాలు ఇవ్వటం అనుకుంటారు. చాలాసార్లు ఊరి అవసరాలకు, మన ఆలోచనలకు మధ్య చాలా తేడా ఉంటుంది. నా దృష్టిలో ఊరు అభివృద్ధి చెందాలంటే- ముందుగా ప్రతీ కుటుంబంలో ఎవరో ఒకరికి ఉపాధి ఉండాలి. ఆ తర్వాత కుటుంబంలో పిల్లలందరూ విద్యావంతులు కావాలి. పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి. ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలి. అందరూ సామరస్యంగా జీవించగలిగిన మౌలికసదుపాయాలు ఉండాలి. ఈ ఐదు అంశాలపైనే నేను దృష్టిని కేంద్రీకరించాను. ముందుగా కొందరికి ఉపాధి కల్పించా. ప్రస్తుతం మా గ్రూపులో దాదాపు రెండు వందల మంది మా ఊరు వాళ్లే ఉన్నారు. ఒకసారి ఉద్యోగ భద్రత కల్పించిన తర్వాత మిగిలినవన్నీ సులభమవుతాయి. ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పాలి. ప్రభుత్వం వద్ద నిధులకు కొరత లేదు. ఆ నిధులు సక్రమంగా అందేటట్లు చూసి, అదనంగా అవసరమైన సాయాన్ని మనం చేయాలనేది నా ఉద్దేశం.

ఉదాహరణకు మా ఊర్లో స్కూల్లో చెప్పే పాఠాలు పిల్లలకు సరిపోవు. ఉన్నత విద్యాభ్యాసం చేయాలంటే వారికి అదనంగా శిక్షణ కావాలి. అందుకోసం ప్రతి రోజు మా ఊర్లో ప్రైవేట్ టీచర్లు వచ్చి స్కూలు పిల్లలకు అదనంగా పాఠాలు చెబుతారు. వారికి అయ్యే ఖర్చు మేం భరిస్తాం. అంతే కాదు ప్రతి వేసవి సెలవులలోను- వందేమాతరం ఫౌండేషన్ ద్వారా పిల్లలకు విద్యావికాస శిక్షణ ఇప్పిస్తున్నాం. పరిసరాల పరిశుభ్రత కోసం ఊరంతా సిమెంట్ రోడ్లు వేయించాం. ప్రభుత్వం కొన్ని నిధులు మంజూరు చేసింది. అదనంగా అయిన ఖర్చును మేము భరించాం. పల్లెటూళ్లలో టాయిలెట్లు పెద్ద సమస్య. మా చిన్నప్పుడు ఎంత పెద్ద కుటుంబంలో మహిళలలైనా బయటకు వెళ్లాల్సిందే. రాత్రిళ్లు వారు చాలా ఇబ్బందులు పడేవారు. దీనిని దృష్టిలో ఉంచుకొని 1500 మరుగుదొడ్లు మంజూరు చేయించాం.

మరుగుదొడ్లు మాత్రమే కాదు- వాటికి అవసరమైన డ్రైనేజీ సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నాం. తాగే నీరు ఒక సమస్య కాబట్టి వాటర్‌ట్రీట్‌మెంట్ ప్లాంట్ పెట్టించాం. గుడిని పునర్ నిర్మించాం. కేవలం మా ఊరులోనే కాదు, మొత్తం మహబూబ్‌నగర్ జిల్లాలోనే అనేక కార్యక్రమాలు చేపట్టాం. మేం చేస్తున్న కార్యక్రమాలకు గ్రామప్రజలు కూడా పూర్తిగా సహకారం అందిస్తున్నారు. అందరి సహకారంతో మా గ్రామం దేశంలోనే ఒక 'మోడల్'గా నిలపాలనేది మా లక్ష్యం.

సివిఎల్ఎన్ ప్రసాద్
ఫోటోలు: రాజ్‌కుమార్
Courtesy-Andhrajyothy

కట్ యవర్ కాల్స్

కట్ యవర్ కాల్స్

Published at: 30-10-2013 07:56 AM
మీ సెల్‌ఫోన్‌లో పొద్దున నుంచి సాయంత్రం వరకు వచ్చిన కాల్స్‌ను ఒకసారి సరి చూసుకోండి. కాల్‌హిస్టరీలో మిస్‌డ్ కాల్స్, డయల్‌కాల్స్, రిసీవ్డ్‌కాల్స్ లెక్కపెట్టండి. అందులో అవసరమైనవి ఎన్ని? అనవసరమైనవి ఎన్ని? తేల్చండి. రోజుకు ఎన్నేసి వృథా కాల్స్ మీ ఫోన్‌కు వస్తున్నాయో అర్థమవుతుంది. ఆ లెక్కన వారం, మాసం వరకు లెక్కపెడితే పనికిరానివి కనీసం యాభై నుంచి వంద ఫోన్‌కాల్స్ ఉంటాయి. మార్కెటింగ్ కాల్స్, ఉబుసుపోక కబర్లు చెప్పుకునే కాల్స్, క్యాజువల్ కాల్స్ ఇవన్నీ ఫిల్టర్ చేస్తే.. అందులో మీకు పనికొచ్చేవి కొన్నే! అనవసర ఫోన్‌కాల్స్‌ను కట్ చేసేందుకు ఒక పద్ధతిని పాటించండి. షాపింగ్‌లకు వెళ్లినప్పుడు, ఎగ్జిబిషన్లను సందర్శించినప్పుడు, కొత్త వాహనాల కొనుగోళ్లకు వెళ్లినప్పుడు, బహుమతులు ఇస్తామంటూ ఊరించే పోటీలకు మీ ఫోన్ నెంబర్‌ను ఇవ్వకపోవడం ఉత్తమం. బీమాపాలసీల కొనుగోళ్లు, వ్యక్తిగత, వాహనరుణాలు, కొనుగోళ్లకు సంబంధించి వివరాలు కనుక్కునేముందు అవసరమైతే తప్ప ఫోన్ నెంబర్లను ఇవ్వకూడదు. ఇంటర్‌నెట్‌లో కూడా వీలైనంత వరకు ఫోన్ నెంబర్లను నమోదు చేయకండి.
రెగ్యులర్‌గా సంభాషించే మిత్రులకు మీ సమయపాలనను తెలియజేస్తే మంచిది. మొహమాటానికి పోకుండా మీ ఆఫీసు పనివేళలు, రాత్రి నిద్రకు ఉపక్రమించే సమయాన్ని చెబితే.. అవతలివాళ్లు అర్థం చేసుకుంటారు. ఫోన్లను చేయడం తగ్గిస్తారు. ఒక్కోసారి మొబైల్ ఆపరేటర్స్ నుంచి వచ్చే వాణిజ్యప్రకటనల కాల్స్ విసుగు తెప్పిస్తుంటాయి. వీటిని పూర్తిగా వదిలించుకునేందుకు సంబంధిత సంస్థకు ఫిర్యాదు చేయవచ్చు. ఇక, మీ ఫోన్‌లో నమోదుకాని కొత్త నెంబర్లను లిఫ్ట్ చేయడం తగ్గించండి. అది అర్జెంటు కాల్ అయితేనో అని అనుకుంటే.. అదే నెంబర్‌కు ఎస్ఎంఎస్ చేసి.. అవతలివ్యక్తి గురించి కనుక్కోండి. ప్రతి చిన్న విషయానికీ చేతిలో ఫోన్ ఉందికదాని కాల్ చేయడం మానండి. చిన్న చిన్న విషయాలకు మెసేజ్‌లు ఇవ్వడమే సుఖం. తరచూ నెట్‌వాడే అలవాటుంటే మెయిల్స్ పంపుకోవచ్చు.
- See more at: http://www.andhrajyothy.com/node/17286#sthash.ysDdkAHj.dpuf
మీ సెల్‌ఫోన్‌లో పొద్దున నుంచి సాయంత్రం వరకు వచ్చిన కాల్స్‌ను ఒకసారి సరి చూసుకోండి. కాల్‌హిస్టరీలో మిస్‌డ్ కాల్స్, డయల్‌కాల్స్, రిసీవ్డ్‌కాల్స్ లెక్కపెట్టండి. అందులో అవసరమైనవి ఎన్ని? అనవసరమైనవి ఎన్ని? తేల్చండి. రోజుకు ఎన్నేసి వృథా కాల్స్ మీ ఫోన్‌కు వస్తున్నాయో అర్థమవుతుంది. ఆ లెక్కన వారం, మాసం వరకు లెక్కపెడితే పనికిరానివి కనీసం యాభై నుంచి వంద ఫోన్‌కాల్స్ ఉంటాయి. మార్కెటింగ్ కాల్స్, ఉబుసుపోక కబర్లు చెప్పుకునే కాల్స్, క్యాజువల్ కాల్స్ ఇవన్నీ ఫిల్టర్ చేస్తే.. అందులో మీకు పనికొచ్చేవి కొన్నే! అనవసర ఫోన్‌కాల్స్‌ను కట్ చేసేందుకు ఒక పద్ధతిని పాటించండి. షాపింగ్‌లకు వెళ్లినప్పుడు, ఎగ్జిబిషన్లను సందర్శించినప్పుడు, కొత్త వాహనాల కొనుగోళ్లకు వెళ్లినప్పుడు, బహుమతులు ఇస్తామంటూ ఊరించే పోటీలకు మీ ఫోన్ నెంబర్‌ను ఇవ్వకపోవడం ఉత్తమం. బీమాపాలసీల కొనుగోళ్లు, వ్యక్తిగత, వాహనరుణాలు, కొనుగోళ్లకు సంబంధించి వివరాలు కనుక్కునేముందు అవసరమైతే తప్ప ఫోన్ నెంబర్లను ఇవ్వకూడదు. ఇంటర్‌నెట్‌లో కూడా వీలైనంత వరకు ఫోన్ నెంబర్లను నమోదు చేయకండి.

రెగ్యులర్‌గా సంభాషించే మిత్రులకు మీ సమయపాలనను తెలియజేస్తే మంచిది. మొహమాటానికి పోకుండా మీ ఆఫీసు పనివేళలు, రాత్రి నిద్రకు ఉపక్రమించే సమయాన్ని చెబితే.. అవతలివాళ్లు అర్థం చేసుకుంటారు. ఫోన్లను చేయడం తగ్గిస్తారు. ఒక్కోసారి మొబైల్ ఆపరేటర్స్ నుంచి వచ్చే వాణిజ్యప్రకటనల కాల్స్ విసుగు తెప్పిస్తుంటాయి. వీటిని పూర్తిగా వదిలించుకునేందుకు సంబంధిత సంస్థకు ఫిర్యాదు చేయవచ్చు. ఇక, మీ ఫోన్‌లో నమోదుకాని కొత్త నెంబర్లను లిఫ్ట్ చేయడం తగ్గించండి. అది అర్జెంటు కాల్ అయితేనో అని అనుకుంటే.. అదే నెంబర్‌కు ఎస్ఎంఎస్ చేసి.. అవతలివ్యక్తి గురించి కనుక్కోండి. ప్రతి చిన్న విషయానికీ చేతిలో ఫోన్ ఉందికదాని కాల్ చేయడం మానండి. చిన్న చిన్న విషయాలకు మెసేజ్‌లు ఇవ్వడమే సుఖం. తరచూ నెట్‌వాడే అలవాటుంటే మెయిల్స్ పంపుకోవచ్చు.
Courtesy-Andhrajyothi

మనం సాయపడితే ఆ హాస్టల్‌కు అన్నీ ఉంటాయి

స్థలం : విశాఖపట్నం శివార్లలోని ఆరిలోవలో అర్బన్ రెసిడెన్షియల్ హాస్టల్.
ఏం జరిగింది : అక్కడున్న అనాథ బాలల సంఖ్య 16 నుంచి 100కు పెరిగింది.
ఎప్పుడు : గడచిన ఆరు నెలల్లో
ఏమిటి విశేషం : రాష్ట్రంలో 27చోట్ల ప్రభుత్వం అలాంటి హాస్టళ్లను ప్రారంభించింది. కాని ఇక్కడొక్కచోటే అది విజయవంతంగా నడుస్తోంది.
ఎవరు కారణం : గూడూరు సీతామహాలక్ష్మి అనే ఉపాధ్యాయిని కృషి.
ఇంత క్లుప్తంగా చదివితే ఏం అర్థమవుతుంది? ఆమె ఎలా చేసిందో ఏమేం చేసిందో తెలుసుకోవాలి కదా మనం. దాని గురించే ఈ కథనం..
ఒకచోట మట్టి ట్రాక్టరు తిరగబడింది. కూలికెళుతున్న భార్యాభర్తలిద్దరూ చనిపోయారు. వాళ్ల ఇద్దరు పిల్లలు అనాథలయిపోయారు. మరోచోట మద్యానికి బానిసైన భర్త క్షణికావేశంలో భార్యను తెగనరికాడు. ఆమె చనిపోయింది, అతను జైలుపాలయ్యాడు. పిల్లలు నిరాశ్రయులయ్యారు. ఇంకోచోట దంపతులకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. విడిపోయి ఎవరి మానాన వారు దూరప్రాంతాలకు ఉపాధి కోసం వెళ్లిపోయారు. బిడ్డలు వీధులపాలయ్యారు.
ఇలాంటి ఉదంతాలన్నిటిలోనూ బలైపోయేది బాలల భవిష్యత్తే. పట్టించుకునేవారు లేక, పాలనాపోషణా లేక వాళ్లు నిరాశ్రయులైపోతుంటారు. ఈ పిల్లలే నగరాలకు చేరి రోడ్ల పక్కన అడుక్కునేవారిగా, చిన్నచిన్న దుకాణాల్లో టీ కప్పులు టిఫిన్ ప్లేట్లు కడిగేవాళ్లుగా, రైల్వే ప్లాట్‌ఫాముల మీదా వీధుల్లోనూ చెత్త ఏరుకునేవారిగా మారిపోతారు. అలా కాకుండా ఉండాలనే సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 'పసిపిల్లలు పనుల్లో కాదు - పాఠశాలల్లో ఉండాలి' అనే నినాదంతో కేంద్ర ప్రభుత్వంలోని 'రాజీవ్ విద్యామిషన్'తో కలిసి ప్రతి జిల్లా కేంద్రంలోనూ అనాథ పిల్లలను చేరదీసి వసతి కల్పించి విద్య నేర్పించడానికి వీలుగా హాస్టళ్లను పెట్టింది.

పందులైనా ఉండవక్కడ...
విశాఖపట్నం శివారు ప్రదేశమైన ఆరిలోవలోని హాస్టల్ ఆ క్రమంలో ఏర్పడిందే. ముందు పదహారు మంది పిల్లలు ఉండేవారు. అప్పుడు గాంధీనగర్ కమ్యూనిటీ హాలును హాస్టల్‌గా వాడుకోమంది ప్రభుత్వం. సాధారణంగా బస్తీల్లోని కమ్యూనిటీ హాళ్లంటే లోకల్ కుర్రకారు కబుర్లు చెప్పుకునే ప్రదేశం. పేకాట మొద లు అన్ని రకాల అసాంఘిక కార్యకలాపాలకూ నిలయాలవి. అలాంటి చోట అనాథ పిల్లల హాస్టలంటే అసౌకర్యాల మురికి కూపంలోకి వారిని తోసినట్టే. అందుకే మొదట్లో పిల్లలు అక్కణ్నుంచి తరచూ పారిపోతూ ఉండేవారు. పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రభుత్వ ఉపాధ్యాయినిగా పనిచేస్తున్న గూడూరు సీతామహాలక్ష్మిని అప్పటి కలెక్టర్ వి.శేషాద్రి ఈ హాస్టల్ బాధ్యతను స్వీకరించమని ఆదేశించారు. "గడిచిన ఫిబ్రవరి ఒకటిన నేను వచ్చేసరికి లెక్కకు పదహారుమంది పిల్లలున్నారు. పందికొక్కులు తవ్వేసిన నేల, ఎలుకలు తిరుగుతున్న కన్నాలు నిండి పెచ్చులూడుతున్న గోడలు, చెమ్మ పట్టి కారుతున్న శ్లాబు, పనిచెయ్యని బోరింగ్ పంపు, అపరిశుభ్రంగా ఉన్న ఒకేఒక్క మరుగుదొడ్డి - ఇదీ దృశ్యం. అలాంటిచోట పిల్లలు కాదుకదా, పందులు కూడా ఉండవు. అందుకే వాళ్లు తరచూ పారిపోయి రోడ్ల మీద అడుక్కుని తినేవారు. కొంతమంది సింహాచలం దేవస్థానం ధర్మసత్రంలో పెట్టే ఉచిత భోజనం తిని తిరిగేవారు. తినడానికి తిండే దొరకని పిల్లలతో చదువుసంధ్యల గురించి ఏం మాట్లాడతాం?'' అన్నారు సీతామహాలక్ష్మి.

అందరూ కలిసి ముందడుగేసి
ఈ అవగాహన ఆమెకు రాగానే తానేం చెయ్యాలో తెలిసిపోయింది ఆమెకు. కలెక్టరును కలిసి కమ్యూనిటీహాలును వీలైనంత బాగుచేయించి సున్నాలేయించారు. విద్యుత్ సౌకర్యం, పరిశుభ్రమైన మరుగుదొడ్లు, నీటి మోటారు, కొళాయిలు ఏర్పడ్డాయి. గ్యాస్ కనెక్షన్ తీసుకొచ్చి వంటగది కట్టించి ప్రతిరోజూ వేళకింత ఆహారం అందించే ఏర్పాట్లు చేశారు. తర్వాత పిల్లలకు వ్యక్తిగత పరిశుభ్రత గురించి బోధించారు. సామాజిక స్పృహ ఉన్న స్థానికులు కొందరిని కూడగట్టారు. అప్పటికే అక్షరాస్యత, అవయవదానం, శరీరదానం వంటి అంశాలను ప్రచారం చేస్తున్న మహిళగా సీతామహాలక్ష్మి విశాఖలో ఎక్కువమందికి పరిచయమున్నవారే. ఆమె సేవాభావం, పట్టుదల తెలిసిన స్నేహితులు, పరిచయస్తులు ఈ హాస్టల్‌ను మెరుగుపరచడానికి ముందుకొచ్చారు. సీఎమ్ఆర్ వస్త్రదుకాణంవారు పిల్లలందరికీ ట్రంకుపెట్టెలు, తాళాలు, రాత్రి వేసుకునే దుస్తులు అందజేశారు.

మరొకరు ప్రతి గదిలోనూ ఫ్యాన్లు అమర్చారు. ఒకరు పుస్తకాల బ్యాగులిస్తే ఇంకొకరు అందరికీ చెప్పులిచ్చారు. పరిశుభ్రమైన నీరందే ఏర్పాటు ఒకరు చేస్తే, పుస్తకాలు, పెన్సిల్‌బాక్సులు, పెన్నులు ఇచ్చారు మరికొందరు. కప్పుకునే దుప్పట్లు, సబ్బులు వంటివి కూడా దాతలిచ్చినవే. ఒకసారి పిల్లలందరినీ సమావేశపరిచి వాళ్లకేం కావాలో రాయమన్నారు సీతామహాలక్ష్మి. "వాళ్లేం రాశారో చూస్తే నా కడుపు తరుక్కుపోయింది. కడుపు నిండా తినేంత పులిహోర, దద్దోజనం, చక్రపొంగలి కావాలని రాశారు ఎక్కువమంది. ఎందుకంటే అప్పటిదాకా వాళ్లు గుడి ప్రాంగణంలో తిరిగేవారు, అక్కడ ప్రసాదంగా పెట్టే ఆ పదార్థాల రుచి వాళ్లకు కాస్తకాస్త తెలుసు. కాని ప్రసాదమంటే కొద్దికొద్దిగానే పెడతారు కదా, మళ్లీ వెళితే పెట్టరు. అందుకే వాటిని కడుపు నిండా తృప్తిగా తినాలని కోరుకున్నారు మా పిల్లలు'' అంటూ కళ్లనీళ్లతో చెప్పారామె. వెంటనే అలాంటివి వండించి పెట్టారు హాస్టల్లో. నెమ్మదిగా వారి సంఖ్య వందకు పెరిగింది. సంఖ్యతోపాటు ఆమె బాధ్యతా పెరిగింది.

వాళ్ల ఇల్లే అనుకుంటారు
వందమంది ఉన్నప్పటికీ ఈ హాస్టలు ఇప్పుడు ఒక పద్ధతిలో నడుస్తోంది. రోజూ ఉదయాన్నే లేచి చదువుకోవడం, పాఠశాలకు తయారవడం, సాయంత్రం వచ్చాక కొద్దిసేపు ఆటలు, వ్యాయామం, మళ్లీ చ దువుకోవడం - ఇలా సాగుతుంది పిల్లల దినచర్య. వాళ్లంతా ఒకటి నుంచి ఎనిమిదో తరగతి చదివే పిల్లలు. పక్కనున్న ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లి చదువుకుంటారు. ఉదయం, సాయంత్రం ట్యూషన్లు చెప్పే ఐదుగురు టీచర్లు, మరో ఏడుగురు నాన్‌టీచింగ్ స్టాఫ్ అనుక్షణమూ వారిని కనిపెట్టుకుని ఉంటారు. వాళ్ల సహకారంతో పిల్లలు ఫినాయిల్, రూమ్ ఫ్రెష్‌నర్‌లు తయారుచెయ్యడం వంటి పనులు నేర్చుకున్నారు. పద్యాలు, డ్యాన్సులు, కోలాటాలు నేర్చుకున్నారు. చిన్నవయసులోనే అనాథలయిపోయిన పిల్లలను కుదురుగా ఒకచోట ఉంచడం, క్రమశిక్షణలో పెట్టి చదివించడమంటే మాటలు కాదు.

దాన్ని సాధ్యం చేసి చూపించారు సీతామహాలక్ష్మి. "ఇది మా ఇల్లు, ఈమె మా అమ్మ. వీళ్లంతా మావాళ్లు, ఇక్కడ మేం భద్రంగా ఉన్నామన్న భావం పిల్లల్లో కలిగితే వాళ్లెక్కడికీ వెళ్లరు. వాళ్లకా భావన కలిగించడంలో మా బృందమంతా సఫలీకృతులయ్యాం. ఇప్పుడెవరైనా బాగా అల్లరి చేస్తున్నా, బాగా చదవడం లేదన్నా ఇక్కణ్నుంచి పంపేస్తామన్న ఒక్క మాట అంటే చాలు. వాళ్లు కళ్లనీళ్లు పెట్టుకుని దారికొచ్చేస్తారు'' అని చెప్పారామె. "ఈ హాస్టల్‌కు ప్రభుత్వం విధించిన సామర్థ్యం 100 మందే. కాని ఒక్క విశాఖపట్నంలోనే ఇంకా 298 మంది వీధిబాలలున్నారని ప్రభుత్వ సర్వేలు తెలియజేస్తున్నాయి. మాకు వాళ్లందరినీ కూడా తీసుకొచ్చి బాగుచెయ్యాలనే ఉంటుందిగాని మా పరిధిలో అది సాధ్యమయ్యే విషయం కాదు'' అంటున్నారు ఈ హాస్టల్ ఉద్యోగులు.

బిల్లులు రాక ఇబ్బంది
అన్నీ చక్కబడ్డాయి కాబట్టి ఇప్పుడంతా బ్రహ్మాండంగా ఉందనుకుంటే పొరపాటే. ప్రభుత్వం మొదలెట్టిన హాస్టలే అయినా, వివిధ శాఖల మధ్య సరైన సమన్వయం లేక బిల్లులు సకాలంలో అంద క ఇబ్బంది పడుతున్నారు హాస్టళ్ల ఉద్యోగులు. బియ్యంతో సహా నిత్యావసర వస్తువుల ధరలన్నీ కొండెక్కి కూర్చున్న ఈ కాలంలో వంద మంది చిన్నారుల కడుపు నింపడమంటే మాటలు కాదు. "ఇంతచేశాక ఈ పిల్లలను వదిలి వెళ్లిపోలేను, అలాగని సకాలంలో నిధులు రాలేదని పిల్లలను పస్తులుంచలేను. మూడునాలుగు నెలలుగా బిల్లులు రాకపోతే నేను దాచుకున్న సొమ్ము, కొన్ని లైఫ్ ఇన్సూరెన్స్ పథకాలు డ్రా చేసి ఆ డబ్బుతో బండి నెట్టుకొస్తున్నా. నా కొడుకు ఉద్యోగస్తువడంతో ఆదుకుంటున్నాడు. స్నేహితులు సాయం చేస్తారుగాని, ఎన్నిసార్లని వాళ్లను అడగ్గలను?'' అని తన నిస్సహాయతను వ్యక్తం చేశారామె. ఆమె చెప్పడం లేదుగాని, బిల్లులు మంజూరు చెయ్యడానికి లంచం అనే భూతం కూడా అడ్డుపడుతోందనిపిస్తుంది హాస్టల్ ఫైళ్లు చూస్తే. ప్రభుత్వ శాఖలు సహకరించకపోవడం వల్లనే మిగిలిన జిల్లాల్లోని హాస్టళ్లు మూతపడ్డాయని కూడా అనిపిస్తుంది. "ఆనకట్టలు, విద్యుత్కేంద్రాల్లాగా పిల్లలు కూడా మన దేశానికి ఆస్తే. శారీరకంగా, మానసికంగా వాళ్లు బలంగా ఎదిగినప్పుడే జాతికి బలం'' అంటున్నారు సీతామహాలక్ష్మి. ఆ భావన అందరికీ ఉన్నప్పుడే కదా ఇలాంటి సంక్షేమ పథకాలు సార్థకమయ్యేది! అనా«థలకు ప్రభుత్వమే అమ్మానాన్న. ఆ అమ్మానాన్నే పట్టించుకోకపోతే వాళ్లేమైపోవాలి?
అరుణ పప్పు
ఫోటోలు: వై.రామకృష్ణ, విశాఖపట్నం
Courtesy-Andhrajyothy