విద్యుత్తు ఎలా ఉత్పత్తి అవుతుంది? నీరు, బొగ్గు, గ్యాస్, గాలి, సూర్యరశ్మితో, ఇంకా పలు రకాలుగా. వీటిలో బొగ్గు, గ్యాస్ వంటి సహజ వనరులు ఇంకా ఎంతకాలమని ఊరుతాయి? ఏదోనాటికి తప్పకుండా అయిపోతాయి. అవి అయిపోవడమే కాదు.. ఓజోన్ పొరకు చిల్లు కూడా భారీగానే పడుతుంది.
విలువైన నీరు కూడా వృథా అవుతుంటే మానవాళి దాహార్తితో అలమటించి చావాల్సిందే. మరి అప్పుడెలా? ఆ పరిస్థితి రాకముందే ఏం చేయాలి? అందుకు నిలువెత్తు సమాధానమే ‘రిట్రీట్’ హాస్టల్ భవనం. ఢిల్లీ సమీపంలోని గుర్గావ్లో గల గ్వాల్ పహాడీ వద్ద దీనిని ‘ద ఎనర్జీ అండ్ రీసోర్సెస్ ఇన్స్టిట్యూట్ (టెరీ)’ నిర్మించింది. సూర్యర శ్మి, గాలి వంటి ఎప్పటికీ తరగని సుస్థిర వనరులను, వ్యర్థాలనే ఉపయోగించుకుని ఆధునిక టెక్నాలజీలకు దీటుగా అనేక సౌకర్యాలను పొందడంపై పరిశోధనలు నిర్వహించే ఈ సంస్థ తన లక్ష్యాలకు అనుగుణంగా సహజ ఎయిర్ కండీషనింగ్కి మార్గం చూపుతూ ఈ రిట్రీట్ని నిర్మించింది.
నేచురల్ ఏసీ ఇలా..!
తర్వాత నివాస గదుల్లో వేడెక్కిన గాలి వె ళ్లేందుకు వెంటిలేటర్ల మాదిరిగా ప్రత్యేక గొట్టాలతో కూడిన మార్గం భవనం పై వరకూ ఉంటుంది. దాంతో వేడి గాలి భవనంపై నుంచి వెళ్లిపోవడం, గదిలోకి తిరిగి భవనం కింది నుంచి చల్లని గాలి రావడం జరుగుతుంది. ఇంకేం.. ఏసీలు, కూలర్లు లేకుండానే వాటికి దీటుగా గది అంతా ఫుల్ ఎయిర్ కండీషన్డ్ అయిపోతుంది. అయితే సహజ ఏసీ వ్యవస్థ వల్ల భవనంలో శీతాకాలంలో 20 డిగ్రీలు, ఎండాకాలంలో 28 డిగ్రీలు, వానాకాలంలో 30 డిగ్రీ సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత వరకూ ఉండవచ్చు. అవసరాన్ని బట్టి.. గాలిలో తేమను, వేడిని తగ్గించే ఎల్పీజీ, అమ్మోనియా ‘చిల్లర్స్’ పరికరాలను కాసేపు ఉపయోగించుకుంటే సరి.. ఏడాదంతా చౌకగానే ఏసీ అన్నమాట.
ప్రకృతి వనరులతో... ‘సుస్థిర’ భవనం!
మురుగు నీరూ.. ఉపయోగమే
హాస్టల్ గదుల నుంచి విడుదలయ్యే మురుగునీరంతా తొలుత ఓ ట్యాంకులోకి చేరుతుంది. అక్కడ ఘనవ్యర్థాలన్నీ ట్యాంకు అడుగున చేరి నీరు మాత్రమే ముందుకు ప్రవహిస్తుంది. ఘనవ్యర్థాలను సూక్ష్మజీవులు కుళ్లబెట్టి విచ్ఛిన్నం చేస్తాయి.
తర్వాత మిగిలే మురికి నీటిని ప్రత్యేకంగా రెల్లుగడ్డి మడిలోకి పంపుతారు. ఇంకేం.. గడ్డివేళ్లను, మట్టిని దాటుకుని అవతలికి చేరేసరికి నీరు దాదాపుగా శుభ్రమైపోతుంది. ఈ నీటిని తాగడానికి పనికిరాకున్నా.. సాగునీటిగా, ఇతర అవసరాలకు మాత్రం ఉపయోగించవచ్చు. నేలలో నీటి శాతమూ పెరుగుతుంది. మానవ వ్యర్థాలతో బయోమీథేన్ కూడా తయారుచేసి వాహనాలకు ఇంధనంగానూ వాడవచ్చు.
- హన్మిరెడ్డి యెద్దుల
రిట్రీట్ అంటే.. తిరోగమనం!
ఇలాంటి పద్ధతులపైనే దృష్టిపెట్టాలి...
సౌరశక్తి వినియోగంలో భారత్ నెంబర్ వన్ కావాలి. థర్మల్ విద్యుత్ కేంద్రాలు కాలుష్యాలను తగ్గించేలా ప్రస్తుతం మెరుగుపర్చాలి. తర్వాత దశలవారీగా వాటిని మూసేయాలి. ప్రతి విషయంలోనూ పాశ్చాత్య విధానాలను అనుసరించకుండా భారతీయులు ఇలాంటి పద్ధతులపై దృష్టిపెట్టాలి. అప్పుడే జల వనరులను కాలుష్యమయం చేయకుండా, అడవులను నాశనం చేయకుండానే దేశం అభివృద్ధి సాధిస్తుంది.
- ‘టెరీ’ డీజీ రాజేంద్ర కుమార్ పచౌరీ (2007లో నోబెల్ శాంతి బహుమతి పొందిన ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ (ఐపీసీసీ)కి చైర్మన్గా కూడా ఉన్నారు)
ఇవీ ప్రత్యేకతలు...
సాధారణ నిర్మాణ వ్యయం కంటే 25% అదనంగా ఖర్చు అయినా.. ఇతర భవనాల ఇంధనం ఖర్చుల్లో 50% వరకూ ఆదా అవుతుంది.
24 సోలార్ వాటర్ హీటింగ్ ప్యానెళ్ల ద్వారా రోజూ 2 వేల లీటర్ల నీరు వేడి చేసుకోవచ్చు.
రిట్రీట్ లాంటి ఓ భవనానికి వెలుగులు పంచాలంటే సుమారు 28 కిలోవాట్ల విద్యుత్ అవుతుంది. కానీ ప్రస్తుతం రిట్రీట్కు 10 కిలోవాట్ల విద్యుత్ మాత్రమే ఖర్చవుతోందట.
ఈ పద్ధతి వల్ల పెట్రోలియం, ఇతర వనరుల దిగుమతి తగ్గుతుంది కాబట్టి.. మారకద్రవ్యం రూపేణా విదేశాలకు భారీగా చెల్లించుకోవాల్సిన పరిస్థితి తప్పుతుంది.
రిట్రీట్లో ఏర్పాటు చేసుకున్న పర్యావరణ అనుకూల పద్ధతుల వ ల్ల ఏటా వాతావరణంలోకి ఎంత మేరకు సీవోటూ ఉద్గారాలు తగ్గుతాయో తెలుసా? అక్షరాలా 570 టన్నులు!
Courtesy-Sakshi
No comments:
Post a Comment